Ram Gopal Varma : సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా వివాదాస్పదం అవుతుంటుంది. తాజాగా ఆయన చేసిన పని కొన్ని వర్గాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా వరంగల్లో మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. తన కొత్త సినిమా కొండను లాంచ్ చేశారు. అయితే ఆర్జీవీ మైసమ్మ తల్లి విగ్రహం మీద విస్కీ పోశారు. ఇది వివాదాస్పదంగా మారింది.
మైసమ్మ తల్లి మీద విస్కీ పోస్తున్న ఫోటోలను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు చేశారు. వరంగల్ లోని మైసమ్మ తల్లి ఆలయం లోపలికి వెళ్తున్నానని, తాను కేవలం వోడ్కా మాత్రమే తాగుతానని, అయినా మైసమ్మ తల్లికి విస్కీ ఇచ్చానని, చీర్స్.. అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.
అయితే ఆయన అలా చేయడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఆలయాల్లో దైవాలకు మద్యం నైవేద్యంగా ఇవ్వడం మామూలే అయినప్పటికీ విగ్రహాల మీద మద్యం పోయరని.. ఆలయం బయట అడ్డంగా నీరు పోసినట్లు మద్యం పోసి మొక్కులు తీర్చుకుంటారని.. కానీ విగ్రహాల మీద విస్కీ పోయరని.. కనుక తమ మనోభావాలను దెబ్బ తీసిన వర్మ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆర్జీవీ విస్కీ పోసిన సంఘటన తాలూకు ఫొటోలు వైరల్గా మారాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…