Ram Gopal Varma : సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా వివాదాస్పదం అవుతుంటుంది. తాజాగా ఆయన చేసిన పని కొన్ని వర్గాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా వరంగల్లో మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. తన కొత్త సినిమా కొండను లాంచ్ చేశారు. అయితే ఆర్జీవీ మైసమ్మ తల్లి విగ్రహం మీద విస్కీ పోశారు. ఇది వివాదాస్పదంగా మారింది.
మైసమ్మ తల్లి మీద విస్కీ పోస్తున్న ఫోటోలను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు చేశారు. వరంగల్ లోని మైసమ్మ తల్లి ఆలయం లోపలికి వెళ్తున్నానని, తాను కేవలం వోడ్కా మాత్రమే తాగుతానని, అయినా మైసమ్మ తల్లికి విస్కీ ఇచ్చానని, చీర్స్.. అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.
అయితే ఆయన అలా చేయడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఆలయాల్లో దైవాలకు మద్యం నైవేద్యంగా ఇవ్వడం మామూలే అయినప్పటికీ విగ్రహాల మీద మద్యం పోయరని.. ఆలయం బయట అడ్డంగా నీరు పోసినట్లు మద్యం పోసి మొక్కులు తీర్చుకుంటారని.. కానీ విగ్రహాల మీద విస్కీ పోయరని.. కనుక తమ మనోభావాలను దెబ్బ తీసిన వర్మ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆర్జీవీ విస్కీ పోసిన సంఘటన తాలూకు ఫొటోలు వైరల్గా మారాయి.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…