Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే మాస్ హీరోగా ఎంతో గుర్తింపు పొందాడు. ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు మాస్ సినిమాలే ఉన్నాయి. రొమాంటిక్ జోనర్లో చేసిన సినిమాలు తక్కువ. ఇక తాజాగా ఆయన పూజా హెగ్డెతో కలిసి రాధే శ్యామ్ అనే రొమాంటిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాధేశ్యామ్ లో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో సందడి చేయనున్నారు. ఇది ఓ గొప్ప ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇక ఈ మధ్యే విడుదలైన ఈ మూవీకి చెందిన టీజర్ యూట్యూబ్లో 60 గంటలకు పైగా ట్రెండింగ్లో ఉండి రికార్డు సృష్టించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యం కాని రికార్డులను రాధే శ్యామ్ తిరగ రాసింది.
కాగా రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ భవిష్యత్ను చెప్పే విక్రమాదిత్యగా నటిస్తున్నారు. వింటేజ్ బ్యాక్డ్రాప్లో సాగే చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఎవరో.. వీరెవరో అంటూ సాగే ఈ పాటకు ఆడియెన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.
కాగా యూట్యూబ్ లో ఈ పాట సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం 5 రోజుల్లోనే ఈ పాట 10 మిలియన్ వ్యూస్ లను సొంతం చేసుకుంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. జనవరి 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…