Naga Chaitanya : నాగచైతన్య ఒక భిన్నమైన మనస్తత్వం కలిగిన వాడని చెప్పవచ్చు. ఇతర హీరోలకు ఆయన పూర్తిగా భిన్నం. తన పనేదో తాను చూసుకుంటాడు తప్ప ఇతరుల విషయాల్లో అసలు జోక్యం చేసుకోడు. వివాద రహితుడు. సౌమ్యుడిగా పేరుగాంచాడు. సినిమా షూటింగ్స్లో పాల్గొనడం.. ప్రమోషన్స్ చేయడం.. రిలీజ్ వేడుకల్లో పాల్గొనడం.. సక్సెస్ అయితే సెలబ్రేట్ చేసుకోవడం.. ఇదీ చైతూ సాధారణ లైఫ్ స్టైల్. సమంతతో విడిపోక ముందు అలాగే ఉన్నాడు. విడిపోయాక కూడా అలాగే ఉన్నాడు. పెద్దగా మార్పు లేదు. కాకపోతే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించిన యువతి దూరమైందన్న బాధ అయితే ఉంటుంది. కానీ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.
విడాకుల అనంతరం సమంతపై నెగెటివిటీ బాగా వచ్చింది. కానీ చైతన్యపై అంత పెద్ద విమర్శలు రాలేదు. కేవలం సమంత ఫ్యాన్స్ మాత్రమే చైతన్యను విమర్శించారు. కానీ అది తక్కువేనని చెప్పవచ్చు. కానీ చైతన్యకు విడాకులు ఇచ్చినందుకు అతని కన్నా సమంతనే ఎక్కువగా విమర్శల పాలైంది. కారణం అందరూ ఊహించిందే.. ఆమె చేసే బోల్డ్ షోనే అన్నింటికీ మూలకారణమని సులభంగా చెప్పవచ్చు. అయితే గతం గతః. ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక వార్తకు చైతూ బాగా డిస్టర్బ్ అయి ఉంటాడని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని అర్థమవుతోంది. ఎందుకంటే.. రూమర్స్ గురించి పట్టించుకుంటే అది ఎంత వరకు వెళ్తుందో బాగా తెలుసు. కాబట్టి వాటిని పట్టించుకోకూడదు. చైతూ కూడా అలాగే చేశాడు.
ఎవరెన్ని కామెంట్స్ చేసినా.. ఎన్ని వార్తలు వచ్చినా చైతూ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. అదే మంచిది. ఏదైనా ట్వీట్ చేసినా లేదా పోస్ట్ పెట్టినా.. అది ఇంకా వివాదం అవుతుంది. కనుక అనవసరంగా బ్యాడ్ అవడం ఎందుకు అనుకున్నాడో ఏమో.. కానీ చైతూ మాత్రం తనపై రీసెంట్గా వస్తున్న పుకార్లపై అసలు స్సందించలేదు. తన సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. నాకు ఇంకా ఏమీ పనిలేదా.. ఇలాంటి వార్తలపై స్పందించాలా.. అన్నట్లుగా చైతన్య అసలు ఆ వార్తలను పట్టించుకోనే లేదు. లేదంటే ఈపాటికి స్పందించి ఉండేవాడు.
ఇక పుకారు వార్తలపై సైలెంట్గా ఉన్న చైతూ సినిమాలపై మాత్రం దృష్టి పెట్టాడు. అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం థాంక్ యూతోపాటు లాల్ సింగ్ చడ్డా సినిమాల ప్రమోషన్లో బాగా బిజీగా ఉన్నాడు. అయితే రానున్న రోజుల్లో అయినా చైతూ తనపై వస్తున్న వార్తలకు స్పందిస్తాడో.. లేదో.. చూడాలి.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…