Karate Kalyani : తెలుగు సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి గురించి అందరికీ తెలిసిందే. ఈమె సినిమాల్లో ఎన్నో బోల్డ్ పాత్రల్లో నటించింది. బయట కూడా ఈమె ఎంతో బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం తన మాటలతో బాగా రెచ్చిపోయింది. కరాటే కల్యాణి తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినా రానీ గుర్తింపు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో బ్రహ్మానందాన్ని బాబీ అంటూ ఓ రకంగా పిలిచిన పిలుపుతోనే బాగా పాపులర్ అయ్యింది.
నటిగా బిజీగా ఉంటూనే ఈ మధ్యకాలంలో సమాజంలో జరిగే సంఘటనలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంది. అయితే ఆమెకు వ్యక్తిగత జీవితం కలిసి రాలేదు. ఆమె ప్రేమించినోడు.. పెళ్లి చేసుకున్నోడు కూడా తనను మోసం చేశారని ఎన్నోసార్లు వాపోయింది. ప్రస్తుతం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. బీజేపీలో చేరిన కరాటే కల్యాణి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లపై నిప్పులు చెరుగుతూ ఉంటుంది. ఇక చెప్పేవి నీతులు చేసేవి బూతు పాత్రలు అని విమర్శలు రావడంతో గత కొద్ది రోజులుగా వ్యాంప్ పాత్రలకు కూడా కరాటే కల్యాణి గుడ్ బై చెప్పేసింది.
ఇప్పుడు కేవలం రాజకీయాల్లో కొనసాగుతోంది. అయితే కొన్ని ఇంటర్వ్యూల్లో కల్యాణి మాట్లాడుతూ పూర్తిగా సినిమాలకు కూడా గుడ్ బై చెబుతా అంటూ వ్యాఖ్యానించింది. అంతే కాకుండా హరికథలు, పురాణాలు చెబితే రాని గుర్తింపు తనకు వ్యాంప్ పాత్రల ద్వారా వచ్చినట్టు తెలిపింది. సినిమాల్లోకి వచ్చి తాను పైట జారిస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరించారు అని పేర్కొంది. ఇప్పటికీ తాను ఏ షో కు వెళ్ళినా బాబీ అంటూ పిలుస్తారని చెప్పింది. తనను గుర్తు పట్టినందుకు సంతోషపడాలో లేదంటే.. తనకు వచ్చిన క్రేజ్ వ్యాంప్ పాత్రల వల్లే వచ్చిందని బాధపడాలో అర్థంకాదని ఆవేదన వ్యక్తం చేసింది కరాటే కల్యాణి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…