Janhvi Kapoor : కొండెక్కిన జాన్వీ కపూర్.. ఫోటో వైరల్!

October 27, 2021 7:51 PM

Janhvi Kapoor : అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్వి కపూర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటుంది.

Janhvi Kapoor trekking photos viral in social media

 

తాజాగా జాన్వీ కపూర్ తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లింది. ఇలా స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా కొండ ఎక్కుతూ అక్కడ ఉన్న పర్వత ప్రాంతాలను, ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జాన్వికపూర్ కొండపై కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాంతి పడేచోట నన్ను ఉంచండి అంటూ క్యాప్షన్ పెట్టింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వికపూర్ ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని దోస్తానా 2, మిలి వంటి చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే జాన్వికపూర్ గత కొద్ది రోజుల నుంచి తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment