గురువారం, జూన్ 11, 2026
ఆధ్యాత్మికం

ఆలయంలో శఠగోపం పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో మీకు తెలుసా?

సాధారణంగా మనం దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత పురోహితులు మన తలపై శఠగోపం పెట్టడం చూస్తుంటాము. అయితే శఠగోపం పెట్టడానికి గల కారణం ఏమిటి? ఎందుకు భక్తుల తలపై మాత్రమే శఠగోపం పెడతారు అనే విషయం…

ఆలయంలో శఠగోపం పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో మీకు తెలుసా?

సాధారణంగా మనం దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత పురోహితులు మన తలపై శఠగోపం పెట్టడం చూస్తుంటాము. అయితే శఠగోపం పెట్టడానికి గల కారణం ఏమిటి? ఎందుకు భక్తుల తలపై మాత్రమే శఠగోపం పెడతారు అనే విషయం బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఆలయానికి వెళ్ళిన భక్తులకు శఠగోపం పెట్టడానికి గల కారణం ఏమిటో, దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి స్వామివారి పాదాలను నమస్కరించే అవకాశం ఉండదు కనుక పూజారి స్వామివారి పాదాల చెంత ఉన్న శఠగోపం తీసుకోవచ్చి భక్తుల తలపై పెడతారు. ఈ విధంగా పూజారి శఠగోపం మన తలపై ఉంచినప్పుడు భక్తులు తమ మనసులో ఉన్న కోరికను కోరుకోవడం వల్ల ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

శఠగోపం మన తలపై పెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశించిపోతాయి.ఈ శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శడగోప్యం అని అంటారు. సైన్స్ ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బయటకెళుతుంది. తద్వారా మనలో ఉన్నటువంటి ఆందోళన అలజడి కూడా తగ్గిపోతాయి. అందుకే ఆలయంలోకి వెళ్ళిన భక్తుడు ఎంతో మానసిక ప్రశాంతతను కలిగి ఉంటాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి