Cough : వానాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి ఒకదాని వెంట ఒకటి వచ్చి ప్రతి ఒక్కరినీ వేధిస్తూ ఉంటాయి. సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఒకసారి వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎన్ని మందులు వాడినా కూడా ఒక్కోసారి ఉపశమనం కలగకుండా అనేక ఇబ్బందులు పడుతూనే ఉంటాము. సీజనల్ గా వచ్చే ఈ అనారోగ్య సమస్యలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా దగ్గు నుండి ఉపశమనం కలిగి ప్రాణానికి హాయినిస్తుంది. చల్లని వాతావరణం ఎప్పుడైతే వస్తుందో వాటర్ తాగినప్పుడు చల్లని నీరు కాకుండా గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
ఇలాంటి సమస్య నుంచి బయటపడటానికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి దానిలో తులసి ఆకులు, అల్లం, మిరియాలు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి వడకట్టుకోవాలి. ఇలా తయారైన ఈ పానీయాన్ని ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం కలిపి తాగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రత అంది దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం ఛాతిలో ఉండే కఫాన్ని బయటకు పంపించి దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
చల్లని వాతావరణం వలన గొంతు నొప్పి సమస్య అధికంగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు వేసుకొని కరిగించుకోవాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని బాగా పుక్కిలించడం ద్వారా గొంతులోని చెడు బ్యాక్టీరియా అనేది బయటకు పోతుంది. తద్వారా గొంతు నొప్పి సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…