Cough : వానాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి ఒకదాని వెంట ఒకటి వచ్చి ప్రతి ఒక్కరినీ వేధిస్తూ ఉంటాయి. సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఒకసారి వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎన్ని మందులు వాడినా కూడా ఒక్కోసారి ఉపశమనం కలగకుండా అనేక ఇబ్బందులు పడుతూనే ఉంటాము. సీజనల్ గా వచ్చే ఈ అనారోగ్య సమస్యలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా దగ్గు నుండి ఉపశమనం కలిగి ప్రాణానికి హాయినిస్తుంది. చల్లని వాతావరణం ఎప్పుడైతే వస్తుందో వాటర్ తాగినప్పుడు చల్లని నీరు కాకుండా గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
ఇలాంటి సమస్య నుంచి బయటపడటానికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి దానిలో తులసి ఆకులు, అల్లం, మిరియాలు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి వడకట్టుకోవాలి. ఇలా తయారైన ఈ పానీయాన్ని ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం కలిపి తాగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రత అంది దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం ఛాతిలో ఉండే కఫాన్ని బయటకు పంపించి దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
చల్లని వాతావరణం వలన గొంతు నొప్పి సమస్య అధికంగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు వేసుకొని కరిగించుకోవాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని బాగా పుక్కిలించడం ద్వారా గొంతులోని చెడు బ్యాక్టీరియా అనేది బయటకు పోతుంది. తద్వారా గొంతు నొప్పి సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…