Simhadri Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో భిన్నమైన చిత్రాల్లో నటించారు. అయితే ఆయన చేసిన సినిమాల్లో కొన్ని ఫ్లాప్ కాగా.. కొన్ని యావరేజ్ టాక్ను సొంతం చేసుకున్నాయి. ఇక కొన్ని మూవీలు అయితే ఆల్ టైమ్ హై వసూళ్లతో రికార్డులను సృష్టించాయి. అలాంటి చిత్రాల్లో సింహాద్రి ఒకటి. వాస్తవానికి ఈ మూవీని బాలయ్య చేయాల్సి ఉంది. అయితే ఆయన అప్పటికే సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి ఫ్యాక్షన్ చిత్రాలను చేసి ఉన్నారు. అందువల్ల ఆయన ఈ మూవీని రిజెక్ట్ చేశారు. దీంతో ఈ మూవీ కథ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లింది.
అలా సింహాద్రి కథను విన్న ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పగా.. దాన్ని బాలయ్యకు కాకుండా ఎన్టీఆర్కు సెట్ అయ్యే విధంగా రాజమౌళి కథను మార్చారు. అలా సింహాద్రి మొదలైంది. వీఎంసీ ప్రొడక్షన్స్ బ్యానర్పై వి.దొరస్వామి రాజు, వి.విజయ్ కుమార్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి కీరవాణి సంగీతం అందించగా.. ఇందులో ఎన్టీఆర్కు జోడీగా భూమిక, అంకిత నటించారు. ఈ క్రమంలోనే అసలు ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.
ఈ మూవీకి గాను రూ.8.50 కోట్ల బడ్జెట్ కాగా మొత్తంగా రూ.26 కోట్లను వసూలు చేసింది. ఈ మూవీ ఎన్టీఆర్ను పూర్తి స్థాయి మాస్ హీరోగా నిలబెట్టింది. ఇందులో ఎన్టీఆర్ పూర్తి మాస్ క్యారెక్టర్లో దుమ్ము రేపాడు. ముఖ్యంగా తాను అక్క పిలుచుకునే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొందరు వ్యక్తులను ఎన్టీఆర్ పరుగెత్తించి మరీ నరికి చంపుతాడు. ఇదే సీన్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. ఇలా ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆ తరువాత కూడా రాజమౌళితో కలిసి తారక్ పలు సినిమాలు చేశాడు. అయినా ఈ మూవీనే ఎన్టీఆర్ను మాస్ హీరోను చేసిందని చెప్పవచ్చు.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…