గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే సమస్యల బారిన పడినట్టే!

చాలామందికి ప్రతిరోజు ఉదయం లేవగానే ఏదో ఒకటి తినే అలవాటు, తాగే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు ఏ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే వాటిని తింటూ ఉంటాం. అయితే ఈ విధంగా పరగడుపున ఆహార పదార్థాలను…

ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే సమస్యల బారిన పడినట్టే!

చాలామందికి ప్రతిరోజు ఉదయం లేవగానే ఏదో ఒకటి తినే అలవాటు, తాగే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు ఏ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే వాటిని తింటూ ఉంటాం. అయితే ఈ విధంగా పరగడుపున ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఉదయం లేవగానే పరగడుపున ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

చాలామందికి ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ముందు రోజు రాత్రి మనం భోజనం చేసి ఉంటాము కనుక మనలో అధిక జీర్ణరసాలు విడుదలై ఉంటాయి. ఈ క్రమంలోనే వేడివేడిగా టీ తాగినప్పుడు కడుపులో తీవ్రమైన మంట కలుగుతుంది. అందుకోసమే ఉదయం కాఫీ లేదా టీ తాగేటప్పుడు ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల గుండెలో అధిక మంట ఏర్పడుతుంది.

మరి కొందరికి ఉదయం లేవగానే పరగడుపున అరటి పండ్లను తినే అలవాటు ఉంటుంది. అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే భోజనం తర్వాత తినడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకానీ పరగడుపున అరటి పండు తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరగడుపున పెరుగు, కూల్ డ్రింక్స్, టమాటాలను తినకూడదు. అలాగే ఉదయం ఉదయం మసాలా కూరలు తినకూడదని నిపుణులు చెబుతుంటారు. ఆహార పదార్థాలను తినటం వల్ల కడుపులో మంట, గ్యాస్ ఏర్పడటం జరుగుతుంది కనుక పొరపాటున కూడా ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి