Samantha : గత కొద్ది రోజులుగా సమంత గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె కూకట్ పల్లి కోర్టులో పలు యూట్యూబ్ ఛానల్స్పై పరువు నష్టం దావా పిటిషన్ వేసింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరపగా ఈ విచారణలో భాగంగా సమంతకు కోర్టు నుంచి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. విడాకులు తీసుకున్న తర్వాత తనని అప్రతిష్టపాలు చేస్తున్నారని సమంత పరువు నష్టం దావా పిటిషన్ వేసింది.
అయితే గురువారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టగా.. కోర్టు తీర్పును శుక్రవారంకు వాయిదా వేసింది. గురువారం కోర్టు సమయం ముగియడంతో తీర్పును వెల్లడించక పోవడమే కాకుండా సమంతా పిటిషన్ పై చురకలు అంటించింది. పరువు నష్టం దావా కింద పిటిషన్ వేసిన తర్వాత తను క్షమాపణ కోరాలి కానీ ఇలా డబ్బులను డిమాండ్ చేయడం ఏంటి అంటూ ప్రశ్నించింది.
ఇలా సమంత పిటిషన్ ను అత్యవసరంగా విచారించడానికి కుదరదని కోర్టు స్పష్టం చేసింది. అయితే సమంత నటిగా ఎంతో బిజీగా ఉండడం వల్ల ఆమె పిటిషన్ ను ఎమర్జెన్సీ కింద విచారించాలని సమంత తరపున న్యాయవాది బాలాజీ కోర్టుకు విన్నవించారు.
ఆయన వాదనను విన్న తర్వాత కూకట్ పల్లి న్యాయమూర్తి కోర్టుకు అందరూ సమానమేనని, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అన్న భావన ఇక్కడ ఉండదని అన్నారు. సమంత కేసును అత్యవసర కేసుగా భావించి త్వరగా విచారించమని కోరడం కరెక్ట్ కాదని, అందరూ చట్టం ముందు సమానమేనని, ఇతర పరువు నష్టం కేసుల్లాగే ఈ కేసును కూడా విచారిస్తామని, మొత్తం ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతామని.. న్యాయస్థానం వెల్లడించింది.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…