Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ నెల 23, 24 తేదీల్లో ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ను నిర్వహించనున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అందించనున్న ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలను అమెజాన్ తెలియజేసింది. ఈ సేల్లో అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను అందించనున్నారు. ఆ వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
అమెజాన్ ప్రైమ్ డే సేల్లో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం మేర తగ్గింపు ధరలను అందివ్వనున్నారు. అలాగే మరో రూ.7వేల వరకు అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ను పొందవచ్చు. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లపై రూ.20వేల వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు. వన్ప్లస్, షియోమీ, టెక్నో, శాంసంగ్, ఐక్యూ, రియల్మి, ఒప్పో, వివో ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు ధరలను పొందవచ్చు. దీంతోపాటు యాక్ససరీలను 40 శాతం తగ్గింపు ధరలకు కొనవచ్చు.
ఈ సేల్లో హెడ్ సెట్స్ రూ.149 ప్రారంభ ధరలకు లభిస్తుండగా, పవర్ బ్యాంక్స్ రూ.499, మొబైల్ కేసెస్, కవర్లు రూ.99, కేబుల్స్ రూ.49, చార్జర్లు రూ.139, స్క్రీన్ ప్రొటెక్టర్స్ రూ.99 ప్రారంభ ధరలకు లభ్యం కానున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్ససరీస్పై 75 శాతం, కెమెరాలు వాటి యాక్ససరీలపై 50 శాతం వరకు, హెడ్ ఫోన్స్పై 75 శాతం వరకు తగ్గింపు ధరలను అందివ్వనున్నారు. దీంతోపాటు ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచ్లు, ప్రింటర్లు, టాబ్లెట్స్, గేమింగ్ యాక్ససరీస్, స్పీకర్లు, డేటా స్టోరేజ్ డివైసెస్, హైస్పీడ్ రూటర్స్, కంప్యూటర్ డివైస్లు, సౌండ్ బార్స్, మానిటర్లు, టీవీలు, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, అమెజాన్ డివైస్లపై భారీ తగ్గింపు ధరలను అందివ్వనున్నారు.
ఈ సేల్లో భాగంగా ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం అదనంగా డిస్కౌంట్ ను ఇస్తారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు అనేక ఇతర ఆఫర్లను కూడా ఈ సేల్లో అందివ్వనున్నారు.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…