Akira Nandan : మెగా ఫ్యామిలీ నుండి హీరోలు క్యూ కడుతూనే ఉన్నారు. ఇప్పటికే క్రికెట్ జట్టు కూడా తయారైంది. ఇక పవన్ తనయుడు అకీరా ఎంట్రీ త్వరలోనే ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఎన్నోసార్లు అకీరా ఎంట్రీ గురించి రూమర్లు కూడా వచ్చాయి. అయితే రేణూ దేశాయ్ మాత్రం తన కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే తాను ఏమాత్రం అడ్డు చెప్పనని చెబుతూనే రూమర్లకు కూడా పలుమార్లు ఫుల్ స్టాప్ పెట్టింది. అకీరా బర్త్ డే సందర్భంగా మళ్లీ అకీరా వెండితెర ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి.
అకీరాకు 18 ఏళ్లు వచ్చాయ్.. అకీరా నాకు కేవలం ఒక మంచి కొడుకు మాత్రమే కాదు.. ఆద్యకు ఓ మంచి అన్న.. తన స్నేహితులకు గొప్ప ఫ్రెండ్, ఎంతో దయాగుణం ఉన్నవాడు.. నిజాయితీ పరుడు.. ఓ జెంటిల్మన్. ఈ రోజు అకీరా యవ్వనంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అకీరాకు విషెస్ అందిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని బాక్సింగ్ వీడియోను షేర్ చేసింది రేణు దేశాయ్. దీంతో అకీరా సినీ ఎంట్రీపై ఊహాగానాలు వచ్చేశాయ్. దీనిపై రేణూ దేశాయ్ స్పందించింది. అతడికి నటనపైన ఆసక్తి లేదు.. ఏ సినిమాలోనూ పాటలు కూడా పాడటం లేదు.. అతని ఎంట్రీ గురించి వచ్చే వార్తలను నమ్మకండి అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.
ఇక అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు. అన్నింట్లో శిక్షణ తీసుకుంటున్నాడు. చూస్తుంటే రానున్న రోజులలో వెండితెర ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరి హర వీర మల్లు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ మోడ్లో ఉంది. పవన్ ఇటీవల సెట్స్లో జాయిన్ అయ్యాడు. ఈ పీరియాడిక్ డ్రామాకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…