Virasana Benefits : మారిన మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒకేచోట కదలకుండా కూర్చుని పని చేయడం వంటి కారణాల చేత ఈ సమస్యుల తలెత్తుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారని చెప్పవచ్చు. చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి పెయిన్ కిల్లర్ లను, స్ప్రేలను వాడుతూ ఉంటారు. వీటిని దీర్ఘకాలం పాటు వాడడం అంత మంచిది కాదు. ఇలా మోకాళ్ల నొప్పులు, మెడ నొప్పులు, నడుము నొప్పి వంటి వాటితో బాధపడే వారు పెయిన్ కిల్లర్ లకు బదులుగా ఆసనం వేయడం వల్ల నొప్పి నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు విరాసనం వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఈ ఆసనం వేయడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. విరాసనం ఎలా వేయాలి… దీని వల్ల మనకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. విరాసనం వేయడానికి గానూ ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. ఇప్పుడు మోకాళ్లను దగ్గరగా ఉంచి అరికాళ్లను దూరంగా చాపి కూర్చోవాలి. తరువాత ఊపిరి పీల్చుకుంటూ నడుమును నిటారుగా ఉంచాలి. అలాగే భూజాలను రిలాక్స్ ఉంచి అర చేతులను తొడలపై ఉంచాలి. ఇలా ఒక నిమిషం పాటు ఉండి మరలా రిలాక్స్ అయ్యి మరలా ఆసనం వేయాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ విరాసనం వేయడం వల్ల అజీర్ణం సమస్య కూడా తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపవమనం కలుగుతుంది.
ఆహారం తిన్న తరువాత ఈ ఆసనాన్ని 5 నిమిషాల పాటు వేయడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే విరాసనం వేసి దీర్ఘశ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిరాశ, ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడిగా ఉన్నప్పుడు రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీంతో ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు అధిక రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా ఒత్తిడి సమస్యలతో బాధపడే వారు విరాసనం వేయడం వల్ల ఒత్తిడి తగ్గి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా రోజూ విరాసనం వేయడం వల్ల మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి తగ్గడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…