Triphala Churnam : చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజానికి ఆయుర్వేదం చాలా చక్కగా పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో త్రిఫల చూర్ణానికి ఉన్న ప్రాధాన్యత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో కూడిన త్రిఫల చూర్ణం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వాత, పిత్త, కఫ సమస్యలకి మంచి ఔషధం ఇది. ప్రతి రోజు త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన, చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఆయుర్వేద నిపుణులు కూడా త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే వివిధ సమస్యలకు దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు.
సమస్త రోగాలని తగ్గించే శక్తి త్రిఫల చూర్ణానికి ఉంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో, అర స్పూన్ వరకు త్రిఫల చూర్ణం వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసిm రాత్రంతా ఉంచి తర్వాత రోజు ఉదయం తాగాలి. భోజనం చేయడానికి ముందు తాగితే మంచిది. ఇలా తాగడం వలన, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు కూడా పెరుగుతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉండవు. ఆకలి కూడా బాగా పుడుతుంది.
శరీరం నుండి విష పదార్థాలను ఇది బయటకి పంపిస్తుంది. లివర్ ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తుంది. త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే, ఊపిరితిత్తుల్లో తేమ, స్లేష్మం యొక్క సమతుల్యతని కాపాడుతుంది. శ్వాసకోశ వ్యాధుల నుండి దూరంగా త్రిఫల చూర్ణం ఉంచుతుంది. అంతేకాకుండా, కండరాలు స్థాయిని కాపాడుతుంది.
త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన కండరాలు దృఢంగా మారుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే కూడా మంచిది. షుగర్ లెవెల్స్ ని త్రిఫల చూర్ణంతో నియంత్రణలో ఉంచచ్చు. ఇలా ఇన్ని సమస్యలకి త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా త్రిఫల చూర్ణాన్ని తీసుకోండి ఈ సమస్యలకు దూరంగా ఉండండి.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…