Sandeep Reddy Vanga Animal Earnings : ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా యానిమల్ మూవీ ఫీవర్ నడుస్తుంది. కొందరు యానిమల్ క్యారెక్టర్స్లోకి ఒదిగిపోతున్నారు. మూవీలోని క్యారెక్టర్స్లో కొందరి ముఖాలతో ఎడిట్ చేస్తున్నారు. రీసెంట్గా సచిన్ టెండూల్కర్ మొదలుకొని ఇషాన్ కిషన్ వరకు పలువురిని చాలా చక్కగా హీరో రణబీర్ కపూర్ క్యారెక్టర్కు జోడించారు. వీడియో మొదలు కావడమే కెప్టెన్ రోహిత్ శర్మ కనిపిస్తాడు. చివరికి విలన్ బాబీ డియోల్ క్యారెక్టర్లో సచిన్ దర్శనిమిస్తాడు. మధ్యలో ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ కనిపిస్తారు. ముంబై ప్లేయర్ల ముఖాలతో చేసిన వీడియో అందరిని తెగ ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన యానిమల్ మానియా నడుస్తుంది. ఇంకా కలెక్షన్స్ స్టడీగానే వస్తున్నాయి. 10వ రోజు కలెక్షన్లను కలిపితే ఈ సినిమా 700 కోట్ల రూపాయలు క్లబ్లో చేరే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా ఇంత హిట్ కావడం వెనక సందీప్ రెడ్డి కృషి ఎక్కువ ఉందని అంటున్నారు. ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమా తీయడానికి కేవలం రూ.1.5 కోట్ల అవసరం కాగా, దాని కోసం 36 ఎకరాల మామిడి తోట అమ్మిన అతను ఇప్పుడు యానిమల్ ద్వారా రూ.200 కోట్లు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. సందీప్ తన సొంత ప్రొడక్షన్ భద్రకాళీ పిక్చర్స్.. టీ-సిరీస్ తో కలిసి సినిమాను తెరకెక్కించగా, ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు సందీప్ ఖాతాలోకి కూడా చేరుతున్నాయి.
అర్జున్ రెడ్డి తీయడానికి ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే ధైర్యం చేసి తీసాడు. రూ.1.6 కోట్ల కోసం తన తండ్రి, సోదరుడు 36 ఎకరాల మామిడి తోట అమ్మినట్లు గతంలో సందీప్ చెప్పుకొచ్చాడు. అయితే అర్జున్ రెడ్డి హిట్తో సందీప్ దశ తిరిగిందని చెప్పాలి. యానిమల్ సినిమాని సందీప్ ,అతని సోదరుడు ఇద్దరు టీ సిరీస్ తో కలిసి నిర్మించారు. ఈ సినిమా 10 రోజుల్లోనే రూ.660 కోట్లు వసూలు చేయడంతో, సందీన్ ఈ సినిమా ద్వారా రూ.200 కోట్ల వరకూ సంపాదించినట్లు సమాచారం. ఇక యానిమల్ మూవీ అందించిన ధైర్యంతో సందీప్ రెడ్డి వంగా రానున్న రోజులలో మరిన్ని పెద్ద సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…