Sandeep Reddy Vanga Animal Earnings : ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా యానిమల్ మూవీ ఫీవర్ నడుస్తుంది. కొందరు యానిమల్ క్యారెక్టర్స్లోకి ఒదిగిపోతున్నారు. మూవీలోని క్యారెక్టర్స్లో కొందరి ముఖాలతో ఎడిట్ చేస్తున్నారు. రీసెంట్గా సచిన్ టెండూల్కర్ మొదలుకొని ఇషాన్ కిషన్ వరకు పలువురిని చాలా చక్కగా హీరో రణబీర్ కపూర్ క్యారెక్టర్కు జోడించారు. వీడియో మొదలు కావడమే కెప్టెన్ రోహిత్ శర్మ కనిపిస్తాడు. చివరికి విలన్ బాబీ డియోల్ క్యారెక్టర్లో సచిన్ దర్శనిమిస్తాడు. మధ్యలో ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ కనిపిస్తారు. ముంబై ప్లేయర్ల ముఖాలతో చేసిన వీడియో అందరిని తెగ ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన యానిమల్ మానియా నడుస్తుంది. ఇంకా కలెక్షన్స్ స్టడీగానే వస్తున్నాయి. 10వ రోజు కలెక్షన్లను కలిపితే ఈ సినిమా 700 కోట్ల రూపాయలు క్లబ్లో చేరే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా ఇంత హిట్ కావడం వెనక సందీప్ రెడ్డి కృషి ఎక్కువ ఉందని అంటున్నారు. ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమా తీయడానికి కేవలం రూ.1.5 కోట్ల అవసరం కాగా, దాని కోసం 36 ఎకరాల మామిడి తోట అమ్మిన అతను ఇప్పుడు యానిమల్ ద్వారా రూ.200 కోట్లు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. సందీప్ తన సొంత ప్రొడక్షన్ భద్రకాళీ పిక్చర్స్.. టీ-సిరీస్ తో కలిసి సినిమాను తెరకెక్కించగా, ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు సందీప్ ఖాతాలోకి కూడా చేరుతున్నాయి.
అర్జున్ రెడ్డి తీయడానికి ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే ధైర్యం చేసి తీసాడు. రూ.1.6 కోట్ల కోసం తన తండ్రి, సోదరుడు 36 ఎకరాల మామిడి తోట అమ్మినట్లు గతంలో సందీప్ చెప్పుకొచ్చాడు. అయితే అర్జున్ రెడ్డి హిట్తో సందీప్ దశ తిరిగిందని చెప్పాలి. యానిమల్ సినిమాని సందీప్ ,అతని సోదరుడు ఇద్దరు టీ సిరీస్ తో కలిసి నిర్మించారు. ఈ సినిమా 10 రోజుల్లోనే రూ.660 కోట్లు వసూలు చేయడంతో, సందీన్ ఈ సినిమా ద్వారా రూ.200 కోట్ల వరకూ సంపాదించినట్లు సమాచారం. ఇక యానిమల్ మూవీ అందించిన ధైర్యంతో సందీప్ రెడ్డి వంగా రానున్న రోజులలో మరిన్ని పెద్ద సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…