Over Weight : అధిక బరువు సమస్య అనేది నేటి తరుణంలో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు వయస్సు మీద పడిన వారే అధికంగా బరువు ఉండేవారు. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే ఊబకాయం బారిన పడుతున్నారు. దీంతో యుక్త వయస్సు వచ్చే సరికి బీపీ, షుగర్ వంటివి అటాక్ అవుతున్నాయి. అయితే అధిక బరువును తగ్గించుకోవడానికి రోజూ వ్యాయామం చేయాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా కింద చెప్పిన ఆహారాలను రోజూ తింటుంటే దాంతో అధిక బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక బరువును తగ్గించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువును తగ్గించడంలో బాదం పప్పు ఎంతగానో సహాయ పడుతుంది. వీటిలో విటమిన్ ఇ తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. బరువు తగ్గేందుకు సహాయ పడతాయి. కనుక రోజూ గుప్పెడు బాదం పప్పును తింటే తప్పక ఫలితం ఉంటుంది. అయితే బాదం పప్పును రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మంచిది. దీంతో ఉదయాన్నే శక్తి లభించడంతోపాటు బరువు కూడా తగ్గవచ్చు. అలాగే రోజంతా యాక్టివ్గా ఉంటారు.
ఇక బరువు తగ్గించడంలో చిరు ధాన్యాలు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. వీటిల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కనుక ఆహారం ఎక్కువగా తీసుకోము. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అయితే వీటిని రోజూ తగిన మోతాదులో తినాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు.. ఈ జాబితాకు చెందుతాయి. వీటిని తింటే బరువు తగ్గుతారు. అలాగే కొబ్బరి నూనెను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీన్ని రోజూ తీసుకుంటే చాలు.. శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
మిరియాలు, దాల్చిన చెక్క, ద్రాక్ష పండ్లను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. కనుక కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఇలా పైన చెప్పిన ఆహారాలను రోజూ తీసుకుంటుంటే దాంతో బరువు తగ్గవచ్చు. అయితే రోజువారీ ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణ, చిరు ధాన్యాలను తీసుకుంటే బరువు తగ్గడం తేలికవుతుంది. కనుక వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీంతో అద్భుతమైన ఫలితాలను రాబట్టవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…