Mulla Thotakura : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఆకు కూరలని చాలా మంది ఎక్కువగా తింటుంటారు. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. పంట పొలాల్లో చూసినట్లయితే ఎక్కువగా మనకి కలుపు మొక్కలు కనబడుతుంటాయి. కొన్ని కలుపు మొక్కలు ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా. వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలియ, చాలా మంది వాటిని పట్టించుకోరు. పైగా కలుపు మొక్కల్ని తీసేసి, పారేస్తూ ఉంటారు.
కానీ ఈ మొక్కల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వరి పొలాల్లో ఎక్కువగా ఈ ముళ్ళ తోటకూర మనకు కనపడుతూ ఉంటుంది. దీని వలన కలిగే లాభాలను చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఆకుకూర కొమ్మల చివర ముళ్ళు ఉంటాయి. దీనిని ముళ్ళ తోటకూర అని పిలుస్తారు. ముళ్ళ తోటకూర ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో లభిస్తుంది. దీనిని తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఎన్నో రకాల పోషకాలని పొందొచ్చు. ఈ చెట్టు వేర్లని కడిగి ఆరబెట్టుకొని నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ వేర్లను సానపెట్టేసి, అరగదీసి గ్లాసు నీటిలో అర టీస్పూన్ మిశ్రమాన్ని కలుపుకొని కనుక తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడొచ్చు.
గాయాలు కనుక అయినట్లయితే ఈ ముళ్ళ తోటకూరని తీసుకుని పేస్ట్ లాగా చేసుకుని రాస్తే రక్తం కారదు. తొందరగా గాయం మానిపోతుంది. దద్దుర్లు వచ్చినప్పుడు కూడా దీనిని రాసుకోవచ్చు. అలా రాస్తే తొందరగా దద్దుర్లు తగ్గిపోతాయి. ఒకవేళ కనుక దీనిని మీరు వాడుకోవాలి అనుకుంటే కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోండి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు కలగవచ్చు. సివియర్ గా వున్నప్పుడు అయితే మాత్రం అస్సలు వాడకూడదు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…