ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. మన శరీరంలో అనేక భాగాలకు క్యాన్సర్ వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటిగా మారింది. రోజూ ఎంతో మంది ఎన్నో రకాల క్యాన్సర్ల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఏడాది 3 లక్షలకు పైగా నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన సర్వేల్లో వెల్లడైంది. అంటే దీన్ని బట్టి చూస్తే క్యాన్సర్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ బాధితుల్లో నోటి క్యాన్సర్ బాధితులు 2 శాతం వరకు ఉంటారని సర్వేలు చెబుతున్నాయి. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనకు నోటి క్యాన్సర్ వచ్చేందుకు కారణమవుతున్నాయని వైద్యులు సైతం చెబుతున్నారు. అయితే అసలు నోటి క్యాన్సర్ ఎలా వస్తుంది ? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ? ఎలా గుర్తించాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నోటి క్యాన్సర్ వస్తే దంతాలు లూజ్గా అనిపిస్తుంటాయి. నోట్లో ఎర్రని లేదా తెల్లని ప్యాచ్లు ఏర్పడుతాయి. నోట్లో పూత, భోజనం మింగడం, నమలడంలో నొప్పి ఉంటుంది. చెవి నొప్పి ఉంటుంది. నోట్లో గడ్డలు వస్తే కూడా ఈ వ్యాధి ఉందని గుర్తించాలి. నోట్లో వాపులు రావడం వంటివి క్యాన్సర్కు లక్షణాలుగా చెప్పవచ్చు. నోటి క్యాన్సర్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా రేడియేషన్ కారణమవుతుంది. అలాగే పర్యావరణ కారకాలు, ఆల్కహాల్లోని కెమికల్స్, గుట్కాలు లేదా పొగాకు నమలడం, పొగ తాగడం వంటివి నోటి క్యాన్సర్ వచ్చేందుకు కారణం అవుతాయి. కనుక ఎవరిలో అయినా నోటి క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి. దీంతో ప్రాణాలను కాపాడుకున్న వారు అవుతారు.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…