Gas Trouble : చాలా మంది, రకరకాల ఇబ్బందులతో బాధ పడుతూ ఉంటారు. ఈరోజుల్లో ఆహారపు అలవాట్లలో చాలా మార్పు వచ్చింది. పైగా, ఆరోగ్యానికి హాని చేసే ఆహారాలను కూడా, ఎక్కువ మంది తీసుకుంటున్నారు. దీనితో, ఎక్కువ మంది అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కడుపులో ఇబ్బందిగా ఉండడం, లేదంటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం, ఛాతిలో మంట, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా అనిపించడం ఇటువంటివి చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు.
కొన్నిసార్లు, నోటి నుండి లేదా కింది నుండి గ్యాస్ రిలీజ్ అవచ్చు కూడా. ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే, ఖచ్చితంగా అది గ్యాస్ సమస్య అని చెప్పొచ్చు. ఇటువంటి సమస్యలు ఉంటే, గ్యాస్ పైన లేదా గ్యాస్ పట్టేసింది అని అంటూ ఉంటారు. తిన్న ఆహారం తిరగడానికి, మన కడుపులో కొన్ని ఆసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఆసిడ్స్ రిలీజ్ అయ్యే లోపు ఆహారాన్ని తినాలి.
లేక పోతే యాసిడ్ మన జీర్ణాశయ గోడల పైన రిలీజ్ అయిపోయి. కడుపులో మంట, నొప్పి వంటి వాటిని కలిగిస్తాయి. టైం లేదు అని తినకపోవడం, ఆసక్తి లేక అనో, లేకపోతే ఆకలి వేయట్లేదు అని అలా తినడం మానేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఇబ్బందులు కలుగుతాయి. ఒకవేళ కనుక ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే, డాక్టర్ల సలహా తీసుకొని మీరు మందులు వాడొచ్చు.
దాని కంటే కూడా, గ్యాస్ సమస్యలు రాకుండా ఉండాలంటే, ముందు టైం కి తినేయాలి. అలా కాకుండా తినడం స్కిప్ చెయ్యద్దు. ఈ తప్పు చేస్తే మాత్రం గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుంది. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్, ఓమోప్రజలే, రాబిప్రజాల్ వంటివి డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది. కానీ, ముందు సమస్య రాకుండా జాగ్రత్త పడడానికి ట్రై చేయండి.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…