Health : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలని పాటిస్తూ ఉంటారు. ఎవరైనా చెప్పినవి లేదంటే ఎక్కడైనా చదివినవి పాటిస్తూ ఉంటారు. ఈ ఆరోగ్య చిట్కాలను కనుక పాటించారంటే మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. పైగా చిటికెలో పలు సమస్యలని మనం దూరం చేసుకోవచ్చు. ఈ అనారోగ్య సమస్యలకి చిటికెలో పరిష్కారం కనబడుతుంది. కడుపు నొప్పిగా ఉంటే ఇంగువ నీళ్లు కొంచెం బొడ్డు మీద ఉంచండి. ఇలా చేయడం వలన కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
కడుపునొప్పితో బాధపడే వాళ్ళు 10 గ్రాములు యాలకుల పొడిని నీళ్లల్లో కలిపి కానీ లేదంటే యాలకులని నానబెట్టి గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. చాలామంది చేదుగా ఉంటుందని కాకరకాయని దూరం పెడుతూ ఉంటారు. కనీసం వారానికి ఒక్కసారైనా కాకరకాయను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా కనీసం నెలకి ఒక సారి ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేయడం మంచిది. అలా చేయడం వలన చర్మ సమస్యలు రావు.
పైగా పసుపు రాసుకుని స్నానం చేస్తే శరీరం మీద ఉండే అవాంచిత రోమాలు పోతాయి. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి పసుపు రాసుకుని స్నానం చేస్తే ఇంకా మంచిది. కళ్ళ కలకలు వచ్చినట్లయితే దూదిని ధనియాలని నానబెట్టిన నీళ్లల్లో ముంచి కళ్ళని తుడిస్తే చక్కటి రిలీఫ్ ని పొందొచ్చు.
తులసి ఆకుల రసాన్ని కనుక కంటి మీద రాస్తే కళ్ళు నీరు కారడం, కళ్ళ మంటలు వంటి బాధల నుండి బయటపడొచ్చు. కాలిన మచ్చలకి తేనె రాస్తే మచ్చలు అన్నీ కూడా సులభంగా పోతాయి. కాళ్లు, చేతులు బెణికితే ఉప్పుతో కాపడం పెడితే ఉపశమనంగా ఉంటుంది. ఇలా ఈ సమస్యలకి సులభంగా పరిష్కారాన్ని పొందవచ్చు.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…