Pimples : మొటిమలు.. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తూ ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత, జిడ్డు చర్మం, వాతావరణ కాలుష్యం, చర్మంపైమృతకణాలు పేరుకుపోవడం వంటి కారణాల చేత మొటిమలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ మొటిమలు కొన్ని సార్లు నొప్పిని కూడా కలిగిస్తూ ఉంటాయి. అలాగే మొటిమలు ఏర్పడిన చోట మచ్చలు, గుంతలు పడుతూ ఉంటాయి. ముఖంపై మొటిముల రావడం వల్ల మనకు ఎటువంటి నష్టం కలగదు. అయితే వీటి వల్ల ముఖం అందవిహీనంగా కనబడుతుంది. కనుక మొటిమలను తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల ఫేస్ వాష్ లను వాడుతూ ఉంటారు.
అయితే ఒక చక్కటి చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా ముఖంపై వచ్చే మొటిమలను అలాగే వాటి వల్ల కలిగే మచ్చలను, గుంతలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను నల్ల మట్టిని తీసుకోవాలి. తరువాత దీనిని మెత్తగా నలగొట్టి జల్లించాలి. ఇలా జల్లించగా వచ్చిన మెత్తని మట్టిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పసుపు వేసి కలపాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ నల్లమట్టిని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నల్లమట్టిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం చల్లబడుతుంది. చర్మం చల్లబడడం వల్ల ముఖానికి రక్తం చక్కగా సరఫరా అవుతుంది.
అలాగే ముఖ చర్మంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది. ఈ విధంగా ముఖానికి మట్టితో ప్యాక్ ను వేసుకోవడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గుతుంది. అలాగే ఈచిట్కాను పాటించడంతో పాటు నీటిని ఎక్కువగా తాగాలి. తాజా పండ్లతో చేసిన జ్యూస్ లను ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ను నీటిలో నానబెట్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల వల్ల కలిగే గుంతలు త్వరగా తొలగిపోతాయి. వీటితో పాటు మొటిమలను గిల్లకూడదు. వాటంతట అవి పగిలే వారకు వాటిని ముట్టుకోకూడదు. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…