Soft Chapati : చాలా మంది ఈరోజుల్లో బరువు తగ్గాలని, ఆరోగ్యం బాగుండాలని రొట్టెలని తయారు చేసుకొని తింటున్నారు. అయితే రొట్టెలని చేసుకునేటప్పుడు కొన్ని తప్పుల వలన అవి మృదువుగా రావు. గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే అలా కాకుండా రొట్టెలు బాగా సాఫ్ట్ గా రావాలంటే ఇలా చేయండి. అప్పుడు బాగా మృదువుగా రొట్టెలు వస్తాయి. ముందు పిండిని బాగా కలుపుకోవాలి. ఇది చాలా ముఖ్యం.
ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా, కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీరు పిండిని కలిపేటప్పుడు కొంచెం పిండిని పక్కన పెట్టుకుంటూ స్లో గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన పిండి బాగా వస్తుంది. కొంచెం పిండి నీళ్లని పీల్చుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు పొడి పిండి కలుపుకుంటూ వెళితే సాఫ్ట్ గా వస్తుంది. ఆఖరున మొత్తం అంతా కలిపి కొంచెం నీళ్లతో తడిపి రెండు చేతులతో నెమ్మదిగా ప్రెస్ చేయండి.
ఈ పిండి బాగా సాఫ్ట్ గా అయిన తర్వాత మీరు మూత పెట్టండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని పిండి దాచుకోవాలని అనుకుంటే కొంచెం నూనెను మీరు పిండి ముద్ద మీద రాసి పెట్టండి. ఎప్పుడూ కూడా ఎయిర్ టైట్ కంటైనర్ లో పిండిని స్టోర్ చేసుకోవడం మంచిది. అలా చేయకపోతే మీరు అల్యూమినియం ఫాయిల్ ని ఉపయోగించవచ్చు.
అలాగే ఒక్కో సారి మనం రోటీలని కూడా నిల్వ ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటాము. కానీ అలా ఉంచితే అవి బాగా గట్టిగా మారిపోతాయి. రోటీలని అలా ఉంచినప్పుడు అవి గట్టిగా మారకుండా ఉండాలంటే ఆ రోటీల మీద కొంచెం నూనె ని కానీ లేదంటే కొంచెం నెయ్యి ని కానీ రాయండి. ఇలా కనుక మీరు రాశారంటే అవి పొడిగా అయిపోవు. తాజాగానే ఉంటాయి. అలాగే మెత్తగా, మృదువుగా ఉంటాయి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…