Trisha : చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అందాల భామ ఒకప్పుడు టాలీవుడ్లో కూడా చాలా సూపర్ హిట్ చిత్రాలలో నటించి అలరించంది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఇప్పుడు కోలీవుడ్కి పరిమితం అయింది. రీసెంట్గా త్రిష పేరు ఎక్కువగా వినిపించింది. ఆమెని రేప్ చేస్తానని మన్సూర్ అలీ ఖాన్ కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున త్రిషకి మద్దతు లభించింది. మన్సూర్ కామెంట్ పై త్రిష కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన దిగొచ్చి క్షమాపణలు చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే త్రిష ఇప్పుడు 40 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటికీ కుర్రభామ మాదిరిగానే ఉంది.
త్రిష వయస్సు 40 ఏళ్లు దాటడంతో కొందరు నెటిజన్స్ ఆమెపై వ్యంగాస్త్రాలు చేస్తున్నారు. ఈ వయస్సులో కూడా హీరోయిన్ గా త్రిషకి అవకాశాలు రావడంపై సోషల్ మీడియాలో కొందరు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. చాలా కాలం ఆ ట్రోల్స్ విన్న త్రిష స్పందించలేదు. కాని ఇప్పుడు గట్టిగా సమాధానం ఇచ్చింది.ఇప్పుడు నా వయసు జాతీయ సమస్యగా మారింది. నాకు నలభై నిండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్టు ఉంది.. వీళ్లు రాసే రాతలు, వీడియోలు అలాగే ఉన్నాయి మరి. వేరే సమస్యే లేనట్టు చివరకు నా వయసు గురించి పిచ్చి రాతలు రాయడం.. సిగ్గనిపించడంలేదా?’ అంటూ కొన్ని ప్లాట్ఫాంస్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘బుద్ధిలేనివాళ్లు చేసే న్యూసెన్స్ ఇది. మొదట్లో పట్టించుకోకూడదనే అనుకున్నా. కానీ ఆగేలా లేవు. అందుకే మాట్లాడుతున్నా. భారతీయ సినీ పరిశ్రమలో 40 దాటిన కథానాయికలు చాలామంది ఉన్నారు. నేనే ప్రథమం కాదు. నాకు ఇప్పటికీ అవకాశాలు రావడం కొందరికి మింగుడుపడడం లేదన్నట్టుగా ఉంది అందుకే పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నేను నటిని. చనిపోయేదాకా నటిస్తూనే ఉంటా. నటనకు వయసుతో నిమిత్తంలేదు. ఆ మాత్రం కామన్సెన్స్ లేకపోతే ఎలా? నా అందం, నా అభినయసామర్థ్యం నాకు గర్వకారణాలు’ అంటూ భావోద్వేగంగా త్రిష మాట్లాడింది.
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…