Renu Desai : రేణు దేశాయ్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో తన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు, తన అభిమానులకు ఆమె దగ్గరగా ఉంటోంది. ఇక సుమారు 20 సంవత్సరాల అనంతరం రేణు దేశాయ్ మళ్లీ ఇటీవలే టైగర్ నాగేశ్వర్ రావు అనే మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఈమె హేమలతా లవణం అనే పాత్రలో నటించి అందరి ప్రశంసలు పొందింది.
అయితే ఈ సినిమా తరువాత ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందని భావించారు. కానీ అలా జరగడం లేదు. తాను తదుపరి ఏ మూవీలో నటించబోతున్నాను అనే విషయంపై రేణు దేశాయ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే నిత్యం సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్కు టచ్లోనే ఉంటోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అన్నింటినీ కూడా ఫ్యాన్స్తో పంచుకుంటోంది.
రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో ఎంతో ప్రేమగా ఉంటుంది. వారికి సంబంధించిన విషయాలను ఆమె తన సోషల్ ఖాతాల ద్వారా తెలియజేస్తుంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఆమె ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. తన పిల్లల ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా వారి గురించి రేణు దేశాయ్ ఒక ఎమోషనల్ పోస్ట్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె కేరళ వెకేషన్లో ఉండగా, ఆమె పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది.
రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యలు కేరళలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకీరా నందన్ పియానో వాయించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అకీరా నందన్ హీరోగా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కూడా. అయితే దీనిపై అటు పవన్, ఇటు రేణు ఎవరూ స్పందించలేదు. ఇక తన పిల్లల గురించి రేణు ఇలా రాసుకొచ్చింది. వాళ్లకు నేను జీవితాన్ని ఇచ్చానా, లేదంటే వాళ్లు నాకు పుట్టడం వల్ల నాకు తిరిగి పునర్జన్మ ఇచ్చారా, అన్నది అర్థం కావడం లేదు, నా పిల్లలను చూసి ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోతుంటాను.. అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్. ఈ నేపథ్యంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక నెటిజన్లు సైతం మీరు నిజంగా చాలా గ్రేట్ మేడమ్, పిల్లలను బాగా పెంచుతున్నారు.. అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రేణు త్వరలోనే ఓ వెబ్ సిరీస్లో నటిస్తుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…