Ramajogayya Sastry : ఇటీవలి కాలంలో సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ఎంత నెగెటివిటీ ప్రచారం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. చేతికి ఎంతొస్తే అంత రాసేసి పెట్టేసి వారిని మానసిక వేధనికి గురి చేస్తున్నారు. బూతులు తిడుతున్నారు. ఇలాంటి ధోరణి మంచి కాదని చెబుతున్నా కూడా ఎవరు కంట్రోల్లో ఉండడం లేదు. అయితే ప్రముఖ సినీ గేయ రచయిత ‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రిపై సోషల్ మీడియాలో కొందరు పేట్రేగిపోతుండగా, వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రామజోయ్య. సోషల్ మీడియాలో కుక్కలు ఎక్కువైపోతున్నాయంటూ ఘాటుగా పేర్కొన్నారు.
మేటర్ లోకి వెళితే మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం చిత్రంలోని ఓ మై బేబీ పాట మీద జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఈ పాటలోని ట్యూన్ను తమన్ కాపీ కొట్టాడంటూ జోరుగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఇక పాటలోని సాహిత్యం మరింత నాసిరకంగా ఉందని, అసలు అందులో సాహిత్యమే లేదని, క్రేవింగ్ క్రేవింగ్ అనే పదాలు తప్పా ఇంకేం లేదని కొందరు నెటిజన్స్ రామజోగయ్య శాస్త్రిని కూడా ట్రోలింగ్ చేశారు. ఆ పాటలో ఎక్కువగా ఇంగ్లీషు మిక్స్ పదాలు దొర్లాయి. అయితే ఈ పాట చెత్తగా ఉందంటూ నెటిజన్లు రామజోగయ్యశాస్త్రిపై పడ్డారు.
దీనిపై రామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రతివాడూ మాట్లాడే వాడే… రాయి విసిరే వాడే” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా… అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం… తెలసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి” అంటూ రామజోగయ్యశాస్త్రి ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. అయితే రామజోగయ్య శాస్త్రి ఈ ట్రోలింగ్ పట్ల కాస్త హర్ట్ అయినట్టుగా తెలుస్తుండగా, ఇందులో నెగెటివిటీ తట్టుకోలేక ట్విట్టర్ నుంచి వైదొలిగినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ ఖాతా కనిపించడం లేదు. తాత్కాలికంగా ట్విట్టర్కు దూరంగా ఉంటారా? లేదంటే.. మళ్లీ వస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…