Ramajogayya Sastry : ఇటీవలి కాలంలో సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ఎంత నెగెటివిటీ ప్రచారం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. చేతికి ఎంతొస్తే అంత రాసేసి పెట్టేసి వారిని మానసిక వేధనికి గురి చేస్తున్నారు. బూతులు తిడుతున్నారు. ఇలాంటి ధోరణి మంచి కాదని చెబుతున్నా కూడా ఎవరు కంట్రోల్లో ఉండడం లేదు. అయితే ప్రముఖ సినీ గేయ రచయిత ‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రిపై సోషల్ మీడియాలో కొందరు పేట్రేగిపోతుండగా, వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రామజోయ్య. సోషల్ మీడియాలో కుక్కలు ఎక్కువైపోతున్నాయంటూ ఘాటుగా పేర్కొన్నారు.
మేటర్ లోకి వెళితే మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం చిత్రంలోని ఓ మై బేబీ పాట మీద జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఈ పాటలోని ట్యూన్ను తమన్ కాపీ కొట్టాడంటూ జోరుగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఇక పాటలోని సాహిత్యం మరింత నాసిరకంగా ఉందని, అసలు అందులో సాహిత్యమే లేదని, క్రేవింగ్ క్రేవింగ్ అనే పదాలు తప్పా ఇంకేం లేదని కొందరు నెటిజన్స్ రామజోగయ్య శాస్త్రిని కూడా ట్రోలింగ్ చేశారు. ఆ పాటలో ఎక్కువగా ఇంగ్లీషు మిక్స్ పదాలు దొర్లాయి. అయితే ఈ పాట చెత్తగా ఉందంటూ నెటిజన్లు రామజోగయ్యశాస్త్రిపై పడ్డారు.
దీనిపై రామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రతివాడూ మాట్లాడే వాడే… రాయి విసిరే వాడే” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా… అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం… తెలసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి” అంటూ రామజోగయ్యశాస్త్రి ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. అయితే రామజోగయ్య శాస్త్రి ఈ ట్రోలింగ్ పట్ల కాస్త హర్ట్ అయినట్టుగా తెలుస్తుండగా, ఇందులో నెగెటివిటీ తట్టుకోలేక ట్విట్టర్ నుంచి వైదొలిగినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ ఖాతా కనిపించడం లేదు. తాత్కాలికంగా ట్విట్టర్కు దూరంగా ఉంటారా? లేదంటే.. మళ్లీ వస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…