House Building Pooja : చాలామందికి, సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవడానికి, డబ్బులుని కూడా దాస్తూ ఉంటారు. కొంతమంది, సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఎప్పటినుండో చూసి చూసి, బ్యాంకు లోన్ తీసుకోవడం లేదంటే ఎలాగో అలా డబ్బులు తెచ్చి ఇల్లు కట్టడం వంటివి చేస్తూ ఉంటారు. నిజానికి, ఇల్లు కట్టాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఇల్లుని పూర్తి చేస్తే ఆ సంతృప్తి వేరు. అయితే, ఇల్లు కట్టడానికి ముందు శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపనకి కూడా ముహూర్తం పెట్టాలి. అలానే, ఎవరు శంకుస్థాపన చేయాలి అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
ఇంటి శంకుస్థాపన కోసం ముందు, ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించండి. ఇంటి యజమాని, యజమానురాలు ఇద్దరి పేర్లు మీద పంచాంగం చూసి, ముహూర్త కాలాన్ని నిర్ణయిస్తారు. ఆ వ్యక్తులు, వారి పేర్లు మీద ముహూర్త బలం లేనప్పుడు, మిగతా కుటుంబ సభ్యుల పేరు మీద ముహూర్తం చూసి, తేదీ, సమయాన్ని నిర్ణయిస్తారు. ఇంటి శంకుస్థాపన కోడలితో చేయించాలా..? కూతురుతో చేయించాలా..? ఈ విషయానికి వస్తే కూతురుతో కంటే కోడలతోనే శంకుస్థాపన కార్యక్రమం చేయిస్తే మంచిది.
ఇంటి కోడలు అంటే ఇంటి సభ్యురాలు. ఇంటికి యజమానురాలు. కొడుకు పేరు మీద కుదరకపోతే కోడలు పేరు మీద పూజ చేయించొచ్చు. కానీ, కూతురుతో మాత్రం చేయించకూడదు. ఎందుకంటే ఆమె మరొక ఇంటి మహాలక్ష్మి కనుక. కాబట్టి, ఇంటి శంకుస్థాపన చేయించేటప్పుడు, కూతురుతో కాదు కోడలితో చేయించాలి. పురోహితులు నిర్ణయించిన టైం కి పూజ కార్యక్రమాలను పూర్తి చేయాలి.
చెప్పిన టైంకి సమయం మించిపోకుండా చూసుకుని, జాగ్రత్తగా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. గృహప్రవేశం సమయానికి ఇంట్లోకి అడుగు పెట్టేయాలి. గృహప్రవేశానికి కూడా ముహూర్తం పెట్టించుకోవాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు, సరైన దిశలో సింహద్వారం పెట్టించడం, వాస్తు ప్రకారం ఇల్లు ఉండడం ఇవన్నీ కూడా ముఖ్యము. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే అంతా మంచి జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…