House Building Pooja : చాలామందికి, సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవడానికి, డబ్బులుని కూడా దాస్తూ ఉంటారు. కొంతమంది, సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఎప్పటినుండో చూసి చూసి, బ్యాంకు లోన్ తీసుకోవడం లేదంటే ఎలాగో అలా డబ్బులు తెచ్చి ఇల్లు కట్టడం వంటివి చేస్తూ ఉంటారు. నిజానికి, ఇల్లు కట్టాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఇల్లుని పూర్తి చేస్తే ఆ సంతృప్తి వేరు. అయితే, ఇల్లు కట్టడానికి ముందు శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపనకి కూడా ముహూర్తం పెట్టాలి. అలానే, ఎవరు శంకుస్థాపన చేయాలి అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
ఇంటి శంకుస్థాపన కోసం ముందు, ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించండి. ఇంటి యజమాని, యజమానురాలు ఇద్దరి పేర్లు మీద పంచాంగం చూసి, ముహూర్త కాలాన్ని నిర్ణయిస్తారు. ఆ వ్యక్తులు, వారి పేర్లు మీద ముహూర్త బలం లేనప్పుడు, మిగతా కుటుంబ సభ్యుల పేరు మీద ముహూర్తం చూసి, తేదీ, సమయాన్ని నిర్ణయిస్తారు. ఇంటి శంకుస్థాపన కోడలితో చేయించాలా..? కూతురుతో చేయించాలా..? ఈ విషయానికి వస్తే కూతురుతో కంటే కోడలతోనే శంకుస్థాపన కార్యక్రమం చేయిస్తే మంచిది.
ఇంటి కోడలు అంటే ఇంటి సభ్యురాలు. ఇంటికి యజమానురాలు. కొడుకు పేరు మీద కుదరకపోతే కోడలు పేరు మీద పూజ చేయించొచ్చు. కానీ, కూతురుతో మాత్రం చేయించకూడదు. ఎందుకంటే ఆమె మరొక ఇంటి మహాలక్ష్మి కనుక. కాబట్టి, ఇంటి శంకుస్థాపన చేయించేటప్పుడు, కూతురుతో కాదు కోడలితో చేయించాలి. పురోహితులు నిర్ణయించిన టైం కి పూజ కార్యక్రమాలను పూర్తి చేయాలి.
చెప్పిన టైంకి సమయం మించిపోకుండా చూసుకుని, జాగ్రత్తగా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. గృహప్రవేశం సమయానికి ఇంట్లోకి అడుగు పెట్టేయాలి. గృహప్రవేశానికి కూడా ముహూర్తం పెట్టించుకోవాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు, సరైన దిశలో సింహద్వారం పెట్టించడం, వాస్తు ప్రకారం ఇల్లు ఉండడం ఇవన్నీ కూడా ముఖ్యము. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే అంతా మంచి జరుగుతుంది.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…