Rakul Preet Singh Wedding : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టార్ హీరోలతో కలిసి పని చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్ల పాటు తన హవా చూపించింది. ఇప్పుడు బాలీవుడ్లో తన సత్తా చూపించేందుకు ప్రయత్నిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ నవంబర్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని గతేడాది అక్టోబర్లో మొదటిసారి ప్రచారం జరిగింది. ఆ రూమర్లను రకుల్ కొట్టిపారేయడంతో.. కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రకుల్ ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుందని తెలుస్తోంది. గోవాలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని,ఈ పెళ్లికి అతి తక్కువ మంది అతిధులను పిలుస్తుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే జాకీ భాగ్నాని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టారని సమాచారం. గత మూడేళ్లుగా జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో ఉన్నారు.టాలీవుడ్లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా చెలామణీ అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్… తెలుగులో రకుల్ కి గుర్తింపు వచ్చింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో. ఈ సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబ , రామ్ చరణ్,అల్లు అర్జున్, నాగార్జున,సాయి ధరమ్ తేజ్ ఇలా వరుసగా స్టార్ హీరోలతో జతకట్టింది.
రకుల్ తెలుగులో చేసిన సినిమాలు కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాఫ్ అయ్యాయి.అయితే ఈమెకు తెలుగులో అవకాశాలు రాకపోవడానికి కారణం సీనియర్ హీరోలతో కూడా జతకట్టి హద్దులు మీరిన రొమాన్స్ అని తెలుస్తుంది. కుర్ర హీరోలు ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో బాలీవుడ్కి పయనమైంది. ప్రస్తుతం తమిళంలో అయలాన్, ఇండియన్ 2 సినిమాలు చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే రకుల్ ప్రియుడు జాకీ భగ్నానీ ఫాల్తు, రంగ్రేజ్, యంగీస్థాన్తో ప్రేక్షకులని పలకరించాడు. అవి పరాజయాలు చెందిన కారణంగా సినిమా ప్రొడక్షన్పై దృష్టిసారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…