Manchu Manoj in OTT : మంచు మోహన్ బాబు ముద్దుల తనయుడు మనోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులని అలరించాడు. ఒకప్పుడు తన సినిమాలతో ఎంతగానో అలరించిన మంచు మనోజ్ కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యాడు. అయితే ఇప్పుడు తిరిగి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. సినిమాలు చేస్తూనే, ఓటీటీ ద్వారా అలరించడానికి రెడీ అయ్యాడు. గతంలో బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా నాని, జూనియర్ ఎన్టీఆర్లు హోస్ట్లుగా అదరగొట్టారు. నాగార్జున అలరిస్తూనే ఉన్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడుతో చిరంజీవి, అన్ స్టాపబుల్ సిరీస్తో బాలయ్య సందడి చేస్తుండడం మనం చూశాం.
ఇక టాలీవుడ్ యువ హీరోలు రానా, విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలు పలు షోలను హోస్ట్ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ జాబితాలోకి రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేరాడు.ఈటీవీ విన్ యాప్ లో మనోజ్ హోస్ట్ చేయనున్న థ్రిల్లింగ్ గేమ్ షో “ఉస్తాద్”. ఈ షో ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆసక్తి రేపిన తాను ఎప్పటి నుంచి ఓటిటి వీక్షకులని పలకరిస్తాడు అనేది కన్ఫర్మ్ అయ్యిపోయింది. డిసెంబర్ 15 నుంచి ఈ షోని స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించడం విశేషం.ఈ షో గెలిచిన ప్లేయర్స్కు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు వెండితెరపై అలరించిన ఈ రాకింగ్ స్టార్.. ఇక ఓటీటీ, టీవీ ప్రేక్షకులకు దగ్గర కానున్నారు.
తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వంశీ కృష్ణ మాట్లాడుతూ.. మనోజ్ కావాలనే బ్రేక్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతుంటే మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. ఇందులో ‘నేను మీ మనోజ్.. నా కథ మీరు రాసుకున్నది, నా రాక మీరు పిలుస్తున్నది‘ అంటూ తన ఫ్యాన్స్ కోసం ఓ రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఈ షో ద్వారా తిరిగి రాబోతున్నారని చెప్పుకు వచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అహం బ్రహ్మస్మి, వాట్ ది ఫిష్ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో తెలియాల్సి ఉంది. మొత్తానికి మనోజ్ రానున్న రోజులలో తన అభిమానులని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు.
ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్…
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…