ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఆయన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం కొంత టైం కేటాయిస్తుంటారు. వారికి అవసరమైన సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో ఏ మాత్రం తగ్గరు. ఇప్పటికే తన ఫ్యామిలీకి విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసిన మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్లాట్ కొనుగోలు చేసి వార్తలలోకి ఎక్కారు.
నగరంలోనే రెసిడెన్షియల్ ఏరియాలకు సంబంధించి అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్లో ఇటీవల మహేశ్బాబు ప్లాటును కొన్నారు. ఈ మేరకు ప్రముఖ బిజినెస్ వెబ్సైట్ మనీ కంట్రోల్ కథనం ప్రచురించింది. మహేష్ బాబు రూ.26 కోట్లు పెట్టి ప్లాటుని కొనుగోలు చేశారని.. స్థలం రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్ వివరాలతో సహా ఒక ప్రముఖ బిజినెస్ ఆన్ లైన్ పత్రిక తెలియజేసింది. 2021 నవంబరు 17న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగినట్లు తెలిపింది.
యర్రం విక్రాంత్రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేశ్బాబు 1442 గజాల ప్లాటును 26 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. స్టాంప్డ్యూటీ కింద రూ.1.43 కోట్లు, ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించినట్లు పేర్కొంది. అయితే ఈ ఇంటి స్థలం కొనుగోలు విషయంపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకూ మహేష్ బాబు స్పందించలేదు. ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…