Kantara Chapter 1 First Look : చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం కాంతార. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రిలీజై బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్గా కాంతార చాప్టర్ 1 చిత్రం రూపొందుతుంది. ఇటివలే షూటింగ్ మొదలుపెట్టిన చిత్రబృందం ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ను అందించింది. కాంతర ఛాప్టర్ 1 నుంచి ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. దీనితో పాటు ఒక టీజర్ కూడా విడుదల చేసింది చిత్రబృందం. వెలుగు చూపించనిలేని ఎన్నో రహస్యాలను చీకటి బయటపెడుతోంది. వాటిని చూసి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది ఆసక్తిని రేకెత్తించే డైలాగ్. అడవి నేపథ్యంలో పౌర్ణమి చంద్రుడు .. ప్రళయకాల రుద్రుడిలా కథానాయకుడు కనిపిస్తున్నాడు.
కాంతార’లో కథ ఆరంభంలో ఒక రాజు అడవిలోని గిరిజన ప్రజలకు భూమిని దానంగా ఇస్తాడు. అంతకు ముందు నుంచి ఈ కథ మొదలవుతుంది. రిషబ్ శెట్టి క్లైమాక్స్ సీన్తో ఫస్ట్ లుక్ టీజర్ మొదలుకాగా.. కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్ జన్మించాడు అంటూ కండలు తిరిగిన దేహంతో.. బాడి అంతా రక్తపు మరకలు బీభత్సంగా ఉన్న తండ్రి పాత్రలో ఉన్న రిషబ్ శెట్టి కనిపించడం టీజర్కి హైలైట్గా మారింది. ప్రీక్వెల్ సినిమాలో రిషబ్ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళారు, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి అంశాలను హైలెట్ చేసి చూపించబోతున్నట్లు టాక్. తొలిపార్టును రూ.16 కోట్లలోపే ముగించిన రిషబ్.. ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
కాంతార చాప్టర్-1 చిత్రానికి కూడా హీరో రిషబ్ శెట్టినే కథ, దర్శకత్వం వహిస్తున్నారు. హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రం నిర్మిస్తుండగా, అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…