Guppedantha Manasu October 14th Episode : ఎవరూ ఊహించని విధంగా, వసుధారని ఎండి చేశాడు రిషి. కొత్త ఎండి గారిని అందరూ స్వాగతిస్తారని అనుకుంటున్నా.. నా భార్య అని మాత్రమే కాదు. ఈ సీటుకి అర్హురాలు అని కూర్చోబెట్టాను అని రిషి చెప్తాడు. జగతి మేడం దగ్గర, నేర్చుకుంది. ఎప్పుడు ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు అని చెప్తాడు రిషి. ఫణీంద్ర ఆ సీట్లో వసుధార ఉంటే, నువ్వు ఉన్నట్టే కదా.. రిషి తనని వెనక ఉండి నడిపిస్తావు కదా అని అంటాడు. రిషి ఎంత సమర్ధుడో వసుధారా కూడా అంతే సమర్థురాలు. శైలేంద్ర గారు మీరు ఏమంటారు అని రిషి అంటాడు. శైలేంద్ర మొక్కుబడిగా ఓకే ఓకే అని చెప్తాడు.
దేవయాని మాత్రం వసుధార ఆడపిల్ల కదా.. ఆ ప్లేస్లో వసుధార కంటే, రిషి కానీ ఇంకెవరైనా కానీ ఉంటే బాగుంటుంది అని చెప్తుంది. మినిస్టర్ అయితే, ఇంతకుముందు కాలేజీ బాధ్యతలని తీసుకున్న జగతి కూడా లేడీ ఏ కదా అని చెప్తారు. పెద్దమ్మా ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను అండగా ఉంటానని చెప్పాను అని ఎండి సీట్ లో కూర్చో పెడతాడు రిషి. రిషి తీసుకున్న నిర్ణయానికి, వసుధార కూడా షాక్ అవుతుంది.
థాంక్యూ ఎండి (మై డార్లింగ్) గారు అని రిషి అంటే, థాంక్యూ ఎంహెచ్ (మై హార్ట్) అని ఇద్దరు మురిసిపోతూ ఉంటారు. ఎంహెచ్ అంటే ఏంటని మినిస్టర్ అడిగితే, మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ అని చెప్తుంది. కంగ్రాట్స్ చెప్పేసి మినిస్టర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత, అందరూ వెళ్ళిపోతారు. ఎండి గారు మీరు పని చేసుకుంటే, నేను వెళ్తానన్న రిషితో, నన్ను మీరు మనస్ఫూర్తిగా ఇక్కడ కూర్చో పెట్టారా అని అడుగుతుంది. నువ్వు ఈ ప్లేస్ కి కరెక్ట్ అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని రిషి వసూతో చెప్తాడు.
ఇదివరకు కూడా ఇలాగే సీట్లో కూర్చోబెట్టారు. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇక మీదట అలాంటి రోజు రాకూడదు అని వసు చెప్తుంది. లేదు వసుధార, ఇకమీదట ఈ రిషి ఆవేశాలకి లొంగడు. ఒకసారి ఆవేశపడడం వలనే, నాకు జీవితాన్ని ఇచ్చిన అమ్మని దూరం చేసుకున్నాను అని చెప్తాడు. మళ్లీ ఆవేశంతో, జీవితాన్ని పంచుకునే భార్యను దూరం చేసుకోలేను. ఏం చేసినా నాకోసం అని, నేను అర్థం చేసుకున్నాను. అమ్మ దూరం అవ్వడంతో, ఆవేశం ఎంత అనర్ధమో తెలిసింది అని రిషి అంటాడు.
మీ క్షేమం కోసం దాచిపెట్టడం వలన, ఇలా జరిగిందని వసు అంటుంది. ఇకమీదట మంచి, చెడు ఏవి కూడా దాచిపెట్టను అని వసుధార చెప్తుంది. ఒకవేళ దాచినా, అది నా కోసమే అనుకుంటాను. నాతో పాటుగా, అమ్మ ఆశీర్వాదం కూడా నీకు తోడుగా ఉంటుందని రిషీ చెప్తాడు. ఏం జరిగినా, మీ సమక్షంలో, మీ తోడుతోనే సాధ్యమవుతుందని వసుధారా రిషి తో చెప్తుంది. ఇప్పుడు నువ్వు నా భార్యవి. ఈ మంగళసూత్రం మెడలో నువ్వు వేసుకోలేదు. నేను కట్టాను. వేదమంత్రాల మధ్య రిషిదారల బంధం ఏర్పడిందని అంటాడు.
ఇంటికి వచ్చి, శైలేంద్ర కోట్ ని విసిరి కొడతాడు. వసుధార ఎండి అనే మాటని భరించలేకపోతుంటాడు. ధరణి వచ్చి, కాఫీ తీసుకురావాలా అని అడుగుతుంది. నేను అడిగానా అని, తనమీద మండిపడతాడు. ఎందుకు కోపంగా ఉన్నారని అడిగితే, ఇంకా మండిపడతాడు. నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవి. నా బాధను నువ్వు తీర్చలేవు వెళ్ళిపో అని అరుస్తాడు. నాకు తెలివి లేదు అని అనుకుంటున్నారు. కానీ, మీ ప్రతి కదలిక నాకు తెలుసు అని ధరణి అంటుంది.
ఇకపై కుట్రలు ఆపేయండి అని కూడా చెప్తుంది. శైలేంద్ర మాత్రం నేను అనుకున్నది జరిగేదాకా, ఈ ప్రయత్నం ఆగదు అని చెప్తాడు. ఎందుకు ఇంత దిగజారి పోతున్నారు. ఇలాంటి సమయంలో చేయరానిదేమైనా చేస్తే, జరగరానిదేనా జరుగుతుందని భయం ఉంది అని ధరణి అంటుంది. శైలేంద్ర నిన్ను కొట్టడం కాదు చంపేయాలి అని చెప్తాడు. చంపడం మీకు కొత్త ఏం కాదు కదా..? మీరు చేసే నేరాలు-ఘోరాలు చూడలేకపోతున్నా ఇకనైనా సరే రిషి వాళ్ళకి, ఎలాంటి అపాయం తల పెట్టకండి అని చెప్తుంది.
రిషి వాళ్ళు నలుగురికి మంచి చేసేవారు. అలాంటి వారికి చెడు చేయాలని చూడకండి అని చెప్తుంది. నువ్వే కాదు. దేవుడు చెప్పిన వినను. ఏం చేయాలో అదే చేస్తాను. నేను చేస్తుంది యుద్ధం అని అంటాడు శైలేంద్ర. అది యుద్ధం కాదు మోసం, వెన్నుపోటు అని ధరిణి అంటుంది. మృగానికి మెంటల్ ఎక్కితే ఎలా ఉంటుందో తెలుసా..? ఎవరితో అయినా నిజం చెప్తే ఇంట్లో వాళ్లంతా నెత్తుటితో తడిసిపోతారు అని శైలేంద్ర అంటాడు. చిన్న అత్తయ్య వాళ్ళ మీద ప్రేమతో ఆగాను. లేకపోతే నిజం ఎప్పుడో బయట పెట్టే దాన్ని అని చెప్తుంది. నీ స్వార్థం కోసం ఆగిపోయావని, పసుపు కుంకాల కోసం ఆగిపోయావని అంటాడు శైలేంద్ర. జన్మలో వీళ్ళు మారరు. రిషి మనసు కుదుటపడిన తర్వాత, అన్ని నిజాలు చెప్తాను. వాళ్లని కాపాడాల్సిన బాధ్యత నాదే అని అంటుంది ధరణి.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…