Animal OTT Release Date : ప్రస్తుతం థియేటర్స్లో దుమ్ము రేపుతున్న చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, రష్మిక ప్రధాన పాత్రలుగా రూపొందిన యానిమల్ చిత్రం అన్ని భాషలలో దుమ్ము రేపుతుంది. యూత్ ఈ చిత్రానికి తెగ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా ఇప్పటికే రూ. 500 కోట్ల కలెక్షన్స్ మార్క్ చేరుకుంది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే దిశగా ముందుకు వెళుతోంది. వెయ్యి కోట్లు ఈజీగా సాధిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. చిత్రంలో రణ్బీర్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యువత ఆయనకు జేజేలు పలుకుతున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి కొద్ది రోజులుగా చర్చ నడుస్తుంది.
డిసెంబర్ 1న యానిమల్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. యానిమల్ సినిమా తొలిరోజే సంచలనం సృష్టించగా, ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కొత్త సినిమా రిలీజైన తర్వాత 45 నుంచి 60 రోజుల్లోనే సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతుంది. ఈ బ్లాక్బస్టర్ మూవీని జనవరి 26న ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్టు సమాచారం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో అదే రోజు నుంచి యానిమల్ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు.. థియేటర్తో పోలిస్తే యానిమల్ మూవీ ఓటీటీ వెర్షన్ లెంగ్త్ ఇరవై నిమిషాల ఎక్కువగానే ఉండబోతున్నట్లు టాక్ నడుస్తుంది. నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతుండగా, దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.
ఇక యానిమల్ చిత్రంలో రణ్బీర్, రష్మికలతో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, శక్త్ కపూర్లు కూడా సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’ను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.. కానీ ఇప్పుడు హిట్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసింది.
ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్…
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…