దసరా పండుగని, హిందువులందరూ కూడా, ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులూ కూడా, అమ్మవారిని పూజించి, ధూప దీప నైవేద్యాలని పెడుతూ ఉంటారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా, తొమ్మిది రోజులు పాటు దసరా ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. పదవరోజు విజయదశమి పండగ చేసి, దసరా పండుగని పూర్తిచేస్తారు. దసరా పండుగ అంటే శక్తి, ఆరాధనకి ప్రాధాన్యతను ఇచ్చే పండుగ అని చెప్పొచ్చు. ఈ తొమ్మిది రోజులని, నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అని పిలుస్తారు.
శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి, శరన్నవరాత్రులు అనే పేరు వచ్చింది. చెడుపై మంచి గెలిచిందని, విజయానికి గుర్తుగా ఈ పండుగని విజయదశమి అని పిలవడం జరుగుతుంది. తొమ్మిది రోజులు పాటు 9 అవతారాల్లో అమ్మవారిని పూజించి, పదవ రోజు విజయదశమి పండుగను చేసుకుంటాము. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం చూసినట్లయితే, రాముడు రావణుడు పై గెలిచాడు అని చెప్తారు.
అంతేకాకుండా, పాండవులు వనవాసానికి వెళ్తూ, జమ్మి చెట్టు మీద ఆయుధాల్ని తిరిగి తీసుకువచ్చిన రోజు కూడా ఇదే అని చెప్తారు. ఈ సందర్భంగా, శమీ పూజ చేయడం కూడా జరుగుతుంది. అయితే, ఈ పండుగ సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు. మహిళలు గాజులు వేసుకునేటప్పుడు అసలు ఈ పొరపాటు చేయకుండా మహిళలు చూసుకోవాలి.
మహిళలు వేసుకునే గాజులు సౌభాగ్యానికి చిహ్నం. మట్టి గాజులు వేసుకుంటే, మహాలక్ష్మి దేవి ఆ ఇంట కొలువై ఉంటుందట. బంగారు గాజులు ఉన్నవాళ్లు, బంగారు గాజులు కూడా వేసుకోవచ్చు. కానీ, వాటితో పాటుగా మట్టి గాజులు కూడా వేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగడం కోసం, నవరాత్రుల్లో ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పింక్ కలర్ గాజులు వేసుకుంటే మంచిది. ఈ రంగు గాజులు వేసుకున్నట్లయితే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…
టీ20 ప్రపంచకప్ 2026లోనే కాదు, అంతకు ముందు కూడా భారత జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయాల బాటలో నడిపిస్తూ…