మనదేశంలో తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి కానుకలను కూడా సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే స్వామి వారికి రోజుకు ఆదాయం కోట్లలో వస్తుంది. ఏడు కొండల వారి దర్శనం చేసుకుంటే సర్వపాపాలు, కష్టాలు, ఆపదలు తొలగిపోతాయి కనుక స్వామి వారిని ఆపదమొక్కులవాడు అని కూడా పిలుస్తారు.
వెంకటేశ్వర స్వామి వారిని ఏడుకొండల వాడిని, ఆపదమొక్కులవాడని,వడ్డీ కాసుల వాడని పిలుస్తారు. అయితే స్వామివారు ఆపదలను తీరుస్తాడు కనుక ఆపదమొక్కులవాడని, ఏడుకొండలపై వెలిసినాడు కనుక ఏడుకొండలవాడని పిలుస్తారు. అయితే స్వామివారిని వడ్డీ కాసుల వాడిని ఎందుకు పిలుస్తారో తెలుసా…
పురాణాల ప్రకారం శ్రీవారు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి భూలోకం వచ్చారు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవిని వైకుంఠంలో వదిలి రావడంతో అతనికి పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి సరిపడే డబ్బులు లేక పోవడంతో కుబేరుడు వద్ద అప్పుగా తీసుకుని వివాహం చేసుకున్నారు.అయితే కుబేరుని అప్పు సంవత్సరంలో గా తిరిగి చెల్లిస్తానన్న శ్రీవారు సంవత్సరానికి కేవలం వడ్డీ మాత్రమే చెల్లించారు. అప్పటి నుంచి ప్రతి ఏడు వడ్డీ మాత్రమే చెల్లించడం వల్ల అప్పు అలాగే పెరుగుతూ వచ్చింది. ఈ విధంగా స్వామివారు కేవలం వడ్డీ మాత్రమే చెల్లించడం వల్ల స్వామివారికి వడ్డీ కాసులవాడనే పేరు వచ్చింది.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…