Saptapadi : హిందూ వివాహాల్లో అనేక ఆచారాలు పాటిస్తారు. ఈ ఆచారాలు ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా ఉంటాయి. అయితే 7 ప్రమాణాలు, కన్యాదానం వంటివి మాత్రం హిందూ వివాహాల్లో దాదాపుగా ఉంటుంది. హిందూ వివాహాల్లో ఇవి ఖచ్చితంగా పరిగణించబడతాయి. ఇవి లేకుండా జరిగే వివాహం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. తాజాగా అలహాబాద్ కోర్టు కూడా సప్తపది హిందూ వివాహానికి చాలా ముఖ్యమైనది అని అభివర్ణించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహానికి సప్తపది తప్పనిసరి అని, అప్పుడే వివాహం పూర్తవుతుందని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొన్నది. అయితే వివాహానికి కన్యాదానం తప్పనిసరి అని ఆ కోర్టు పరిగణించలేదు. తాజాగా ఒక క్రిమినల్ కేసు విచారణలో భాగంగా, పిటిషినర్ తన వివాహంలో కన్యాదానం చేయలేదని, దీనిని ధృవీకరించడానికి సాక్షులను మళ్లీ విచారించాలని కోర్టును అభ్యర్థించారు. అప్పుడు కోర్టు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ను ప్రస్తావించింది.
హిందూ వివాహాలకు సప్తపది తప్పనిసరి అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో కన్యాదానం జరిగిందా లేదా అన్నది ముఖ్యం కాదు కనుక సాక్షులను మళ్లీ పిలవాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. అసలు హిందూ వివాహాలకు సప్తపది ఎందుకు ముఖ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ వివాహంలో సప్తపది ఆచారాలు ఖచ్చితంగా నిర్వహించబడతాయి. వివాహం జరిగేటప్పుడు వధూవరులు ఏడు వాగ్దానాలను చేసుకుంటారు. సప్తపదిలో మొదటి అడుగు ఆహారం కోసం, రెండవది బలం కోసం, మూడవది సంపద కోసం, నాలుగవది సంతోషం కోసం, ఐదవది కుటుంబం కోసం, ఆరవది ఋతుక్రమం కోసం, ఏడవది స్నేహం కోసం. వివాహం తరువాత భార్యాభర్తలు జీవిత ప్రయాణంలో కలిసి ముందుకు సాగాలని మరియు జీవితంలో ప్రతి రంగంలో కలిగి పనిచేయాలని ఇది చెబుతుంది.
అలాగే ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకోవాలని ఇది చెబుతుంది. తద్వారా వారి వైవాహిక జీవితం సంతోషంగా మరియు సపన్నంగా ఉంటుంది. ఈ సమయంలో వధూవరులు అనేక మంత్రాలను కూడా పఠిస్తారు. దీంతో వారికి దేవున్ని ఆశీస్సులు కూడా లభించి వారు కొత్త జీవితాన్ని హాయిగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…