Habits : మనం చేసే పొరపాట్ల వల్ల కష్టాలు పాలవ్వాల్సి ఉంటుంది. అందుకని తెలిసి కానీ తెలియక కానీ మనం తప్పులు చేయకూడదు చాలా మంది రోజు చేసే పొరపాట్లు ఇవి. ఇలాంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది లేకపోతే కష్టాలు తప్పవు. పొద్దు ఎక్కే దాకా ఇంట్లో నిద్రలేకుండా అలా పడుకోవడం మంచిది కాదు. లేచిన వెంటనే కల్లాపు చల్లడం మంచిది కాదు. నిద్రలేవగానే దుప్పటిని వెంటనే మడత పెట్టాలి. లేకపోతే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుని ఉంటుంది.
అన్నం తిన్న తర్వాత ఎంగిలికంచాన్ని వెంటనే తీసేయాలి. మాసిన బట్టల్ని ఉతికిన తర్వాత స్నానం చేయాలి. బట్టలు పిండిన నీటిని కాళ్ళ మీద అసలు పోసుకోకూడదు. ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురుని అసలు నిలబెట్టకూడదు. వంట అయిన తర్వాత వంట గదిలో సామాన్లు ని వెంటనే శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు చిత్రపటాలని పెట్టకూడదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె ఇంటికి తెచ్చుకోకూడదు. సంధ్యాకాలంలో సంసారం నిషేధం. ఆ సమయంలో నిద్ర పోకూడదు కూడా.
పొద్దెక్కిన తర్వాత పెరుగు, మినప పొడి ఎవరికి ఇవ్వకూడదు. కూరగాయలను కూడా ఎవరికి ఇవ్వకూడదు. ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఎవరికీ ఇవ్వకూడదు. శనివారం నాడు చెప్పులు, గొడుగు, నూనె ఇంటికి తెచ్చుకోకూడదు. శనివారం నాడు నలుపు దుస్తులు అసలు వేసుకోకూడదు. ఇంటికి తెచ్చుకోకూడదు కూడా. శనివారం నాడు చెప్పులు, నల్లని వస్తువులు, నీలం వస్తువులు ఇస్తే తీసుకోకండి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగానే ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత తుడిచిన తువ్వాలని తలుపు మీద వేయకూడదు. ఉదయం లేవగానే పాచి ముఖంతో అద్దంలో చూసుకోకూడదు. ఇంటి గుమ్మాల మీద కూర్చుని మాట్లాడుకోకూడదు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…