Lord Ganesha : మనం మొదట ఏ పూజ చేయాలన్నా కూడా వినాయకుడిని మొదట పూజిస్తాం. ఆ తర్వాత మిగిలిన దేవుళ్ళకి పూజలు చేస్తాం. వినాయకుడిని మొదట మనం పూజిస్తే, ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు ఉండకుండా మనం అనుకున్నవి పూర్తవుతాయని వినాయకుడిని మొదట కొలుస్తాము. అయితే, ఎప్పుడూ కూడా చాలా మందిలో వుండే సందేహం ఏంటంటే, వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలి..? ఎటువైపు ఉంటే మంచిది అని.. అయితే, ఈ విషయం గురించి ఎంతో మందికి తెలియకపోయి ఉండొచ్చు. మరి ఆ విషయాన్ని చూసేద్దాం.
కొంతమంది కుడివైపుకి తిరిగిన తొండాన్ని కలిగిన వినాయకుడిని తీసుకోవాలి అంటే, ఇంకొందరు ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడు ఉండడం మంచిదని అంటుంటారు. మరి ఏది మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడికి తొండము ఎంతో ముఖ్యమైనది. కుడివైపుకి తిరిగి ఉన్న తొండం ఉన్న గణపతిని, లక్ష్మీ గణపతి అంటారు. తొండం లోపలి వైపుకి ఉంటే, ఆ గణపతిని తపోగణపతి అంటారు.
తొండము ముందుకు ఉంటే, ఆ గణపతికి అస్సలు పూజ చేయకూడదట. గణపతికి ఒక దంతం విరిగి ఉంటుంది. విరిగి ఉన్న దంతాన్ని చేతితో పట్టుకుని ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటారు. ఈ గణపతి కి కూడా పూజలు చేయకూడదు. గణపతి వాహనం ఎలుక. మనం పూజించేటప్పుడు, ఖచ్చితంగా వినాయకుడికి ఎలుక ఉండేటట్టు చూసుకోవాలి.
గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా చూసుకోవాలి. పూజించేటప్పుడు, గణపతి ముఖంలో చిరునవ్వు ఉండాలి. గణపతి ప్రతిమ చిరునవ్వు కలిగి ఉంటే, సుఖసంతోషాలు కలుగుతాయి. గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డూ, ఇంకో చేతిలో కమలం, అలానే మిగిలిన చేతుల్లో శంఖము, ఆయుధము ఉండాలి. వినాయకుడికి తొండం ఎప్పుడూ ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. ఇటువంటివే కొనడం మంచిది. గణేశుడికి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి వైపే, అనగా ఎడమవైపుకి ఉండాలని పండితులు అంటున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…