Bell In Temple : హిందూ పూజా విధానంలో పూజ సమయంలో గంటకొట్టడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గంట లేకుండా పూజ సంపూర్ణంగా పరిగణించబడదు. ఇల్లు అయినా, గుడి అయినా పూజ చేసేటప్పుడు గంట కొట్టాల్సిందే. అలాగే పూజ సమయంలోనే కాకుండా భగవంతునికి నైవేద్యం సమర్పించే సమయంలో కూడా గంట కొడతారు. ఇది మనందరికి తెలిసిందే. అయితే నైవేద్యం సమర్పించేటప్పుడు గంట ఎందుకు కొడతారు.. గంట కొట్టేటప్పుడు పాటించాల్సిన నియామాలు ఏమిటి.. దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, గాలి మూలకాలను మేల్కొల్పడానికి గంటనే మోగిస్తారు. గాలిలో వాయు, సమాన వాయు, అపాన వాయు, ఉదాన వాయు, ప్రాణ వాయు అనే 5 మూలకాలు ఉంటాయి. భగవంతునికి నైవేధ్యం సమర్పించేటప్పుడు 5 సార్లు గంట కొట్టడం వల్ల ఈ 5 మూలకాలు మేల్కొంటాయి. ఈ మూలకాల ద్వారా భగవంతుడు నైవేధ్యాన్ని స్వీకరిస్తాడని విశ్వసిస్తారు. అలాగే భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. నైవేద్యాన్ని ఎప్పుడూ తమలపాకులో ఉంచి దేవుడికి సమర్పించాలి. తమలపాకు దేవతలకు ఎంతో ప్రీతికరమైనది.
సముద్ర మథనం సమయంలో అమృతం చుక్క నుండి తమలపాకు ఉద్భవించిందని, అందుకే తమలపాకు దేవతలకు చాలా ప్రీతికరమైనదని పండితులు చెబుతున్నారు. అలాగే భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు 5 సార్లు గంట కొట్టడంతో పాటు ఈ 5 మంత్రాలను కూడా చదవాలి. ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, అనే మంత్రాలను జపించిన తరువాత చేతిలోకి నీటిని తీసుకుని ప్రసాదం చుట్టూ తిప్పి, భూమిపై నీటిని వదలాలి. ఈ విధంగా భగవంతునికి నైవేద్యం సమర్పించాలని అప్పుడే మనకు పుణ్య ఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…