రాఖీ పండుగ సందర్బంగా ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగను చాలా మంది జరుపుకుంటారు. ఆదివారం అలాగే చాలా మంది సోదరిలు తమ సోదరులకు రాఖీలు కట్టారు. ఆ విధంగానే ఆ 5 మంది కూడా తమ సోదరుడికి రాఖీలు కట్టేందుకు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తూ అతను చనిపోయాడు. అయినప్పటి వారు తమ సోదరుడి మృతదేహం చేయికి రాఖీలు కట్టారు. ఈ సంఘటన నల్గొండలో చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లాలోని ఇందుగుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మాలగూడెం అనే గ్రామంలో చింతపల్లి లక్ష్మయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి 59 ఏళ్లు. ప్రతి ఏటా అతని 5 మంది సోదరిలు అతని ఇంటికి వచ్చి రాఖీ పౌర్ణమి సందర్బంగా రాఖీలు కడుతుంటారు. అలాగే ఈసారి కూడా రాఖీలు కట్టేందుకు వచ్చారు.
అయితే ఆదివారం అతను అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. దీంతో అతని సోదరిలు తీవ్రంగా దుఃఖించారు. అయినా సరే తమ సోదరుడి మృతదేహం చేయికి వారు రాఖీలు కట్టారు. ఎర్ర లక్ష్మమ్మ, నామా పద్మ, అల్లపూరి వెంకటమ్మ, కదిరి కోటమ్మ, జక్కి కవిత అనే మహిళలు తమ సోదరుడికి రాఖీలు కట్టారు. ఆ దృశ్యం అందరినీ కంట తడి పెట్టించింది. తమ సోదరుడికి చివరి సారిగా రాఖీలు కట్టి వారు వీడ్కోలు పలికారు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…