Kidney Problems : చాలామంది, ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది, కిడ్నీ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. రక్తం నుండి వ్యర్థాలని బయటకి పంపే సామర్థ్యం కనుక కిడ్నీలకి తగ్గింది అంటే, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కలుగుతాయి. చాలామంది, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, కొంతమేర ఈ సమస్య నుండి బయట పడొచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు, క్యాబేజీ తీసుకుంటే మంచిది. క్యాబేజీ లో ఉండే పొటాషియం, ఫాస్ఫరస్ కిడ్నీ సమస్యల వాళ్లకి ఉపశమనాన్ని ఇస్తుంది.
ఇందులో సోడియం తక్కువ ఉంటుంది. విటమిన్స్, మినరల్స్, పవర్ఫుల్ ప్లాంట్ కాంపౌండ్స్, విటమిన్ కె, విటమిన్ సి ఇందులో ఎక్కువ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా క్యాబేజీలో ఉంటుంది. కనుక, జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగు కదలనికల్ని సరిగా ఉండేటట్టు చేస్తుంది. కాలీఫ్లవర్ లో ఉండే పోషకాలు కూడా కిడ్నీ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. కాలీఫ్లవర్ లో విటమిన్స్ బాగా ఉంటాయి. అలానే ఫోలేట్ కూడా ఉంటుంది. టాక్సిన్స్ ని ఇది బయటికి పంపించేస్తుంది.
కాలీఫ్లవర్ ని మీరు ఉడకబెట్టుకుని తీసుకోవచ్చు. ఇందులో సోడియం తక్కువగా పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే, గుడ్డులోని తెలసోన తినడం మంచిది. అవసరమైన ప్రోటీన్ మీకు లభిస్తుంది. డయాలసిస్ చికిత్స చేయించుకున్న వాళ్లు కూడా దీనిని తీసుకోవచ్చు. గుడ్డును బాగా ఉడికించి మీరు తీసుకోవచ్చు.
అలానే, ఆమ్లెట్, సాండ్విచ్ ల కోసం తెల్ల సొనని వాడడం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు, సోడియం తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వెల్లుల్లిలో కూడా సోడియం తక్కువ ఉంటుంది. పొటాషియం ఎక్కువ ఉంటుంది. రెండు వెల్లుల్లి రెబ్బల్ని ఉడికించి తీసుకోవచ్చు లేదంటే కూరలో కూడా వేసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తినేటట్టు చూసుకోవడం మంచిది.
గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్తో కలిసి చేసిన ఓ సరదా…
ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్…
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…