కరోనా బారిన పడ్డాక బతికించండి మహాప్రభో.. అని వెళితే దోచుకునే హాస్పిటల్స్నే మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. కానీ ఇప్పటికీ కొంత మంది వైద్యులు ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపిస్తున్నారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండానే రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అలాంటి డాక్టర్లలో ఈయన ఒకరు.
బెంగళూరుకు చెందిన 37 ఏళ్ల డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బి అక్కడి బీజీఎస్ హాస్పిటల్లో కొన్నేళ్లుగా పనిచేశారు. తరువాత బీబీఎంపీ హాస్పిటల్లో రాత్రి షిఫ్టులో కోవిడ్ కేర్ సెంటర్లో పనిచేస్తున్నారు. అయితే రాత్రి పూట డ్యూటీ కాబట్టి ఉదయం ఓ వాహనంలో తిరుగుతూ కోవిడ్ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఈయన 2011లోనే మాతృ శ్రీ పేరిట ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఊళ్లో తిరుగుతూ అవసరం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాదు ఉచితంగా మందులను కూడా ఇస్తుంటారు.
ఇక కరోనా వల్ల ప్రస్తుతం ఆయన కోవిడ్ బాధితులకు వారి ఇళ్ల వద్దే వైద్య సేవలు అందిస్తున్నారు. తన వాహనాన్ని ఆయన ఓ మొబైల్ క్లినిక్గా మార్చారు. అందులో ఆక్సిజన్ సిలిండర్, ఈసీజీ మెషిన్ వంటివి ఉంటాయి. ఇక అవసరం అయిన వారికి మందులను కూడా ఉచితంగానే ఇస్తున్నారు. కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికే ప్రస్తుతం సేవలు అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఆయన రోజంతా సుమారుగా 100 కిలోమీటర్లు కవర్ చేస్తూ అలా రోగులకు చికిత్స అందిస్తారు. రాత్రి మళ్లీ యథావిధిగా విధులకు హాజరవుతారు. ఆయన అందిస్తున్న సేవలకు ఆయన్ను అందరూ ప్రశంసిస్తున్నారు. అవును.. ఇలాంటి డాక్టర్లు ఉన్నారు కాబట్టే ఇంకా మానవత్వం బతికి ఉందని చెప్పవచ్చు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ఈ డాక్టర్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…