Prithviraj Sukumaran : వరుస పెట్టి, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని మంచి సినిమాలను, చాలామంది మిస్ అయిపోతున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఈయన అందరికీ సుపరిచితమే. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా పృథ్విరాజ్ తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఆయన నటించిన, సినిమాలలో జనగణమన ఒకటి ఈ మూవీ మలయాళం లో రిలీజ్ అయి, సూపర్ హిట్ అయింది. విమర్శకులు కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో, ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా స్టోరీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పృధ్విరాజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ లో విలన్ గా నటిస్తున్నారు. ఆయన నటించిన జనగణమన సినిమా 2022లో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో మమతా మోహన్ దాస్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కథ గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. లెక్చరర్ సభా మరియం (మమతా మోహన్ దాస్) ని అత్యాచారం చేస్తారు. ఆ తరవాత, ఆమె బాడీని కాల్చి రోడ్డు పక్కన పడేస్తారు. ఆమె పనిచేసిన యూనివర్సిటీ విద్యార్ధులు లెక్చరర్ కి న్యాయం చేయాలని ఆందోళనకు దిగుతారు.
సభా మరియం తల్లి న్యాయం కోసం పోరాడుతుంది. ఏసీపీ సజ్జన్(సూరజ్ వెంజనమూడు) రంగంలో దిగుతాడు.ప్రత్యక్షసాక్షి చెప్పిన సాక్ష్యంతో నలుగురు నిందితులను పట్టుకుంటాడు. సొసైటీ నుండి నిందితులను చంపేయాలి అని డిమాండ్ వస్తుంది. పై నుంచి ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏసీపీ సజ్జన్ స్టేషన్ కు తరిలించే సమయంలో నిందితులను ఎన్ కౌంటర్ చేస్తాడు.
దీని మీద హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు పెడుతుంది. కేసులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఏసీపీ సజ్జన్ కి వ్యతిరేకంగా కేసు వాదిస్తాడు. నెక్స్ట్ ఏం అవుతుంది..? అరవిందన్ ఎవరు…? ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు..? సభా మరియం ఎందుకు చనిపోయారు..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…