Prithviraj Sukumaran : వరుస పెట్టి, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని మంచి సినిమాలను, చాలామంది మిస్ అయిపోతున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఈయన అందరికీ సుపరిచితమే. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా పృథ్విరాజ్ తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఆయన నటించిన, సినిమాలలో జనగణమన ఒకటి ఈ మూవీ మలయాళం లో రిలీజ్ అయి, సూపర్ హిట్ అయింది. విమర్శకులు కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో, ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా స్టోరీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పృధ్విరాజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ లో విలన్ గా నటిస్తున్నారు. ఆయన నటించిన జనగణమన సినిమా 2022లో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో మమతా మోహన్ దాస్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కథ గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. లెక్చరర్ సభా మరియం (మమతా మోహన్ దాస్) ని అత్యాచారం చేస్తారు. ఆ తరవాత, ఆమె బాడీని కాల్చి రోడ్డు పక్కన పడేస్తారు. ఆమె పనిచేసిన యూనివర్సిటీ విద్యార్ధులు లెక్చరర్ కి న్యాయం చేయాలని ఆందోళనకు దిగుతారు.
సభా మరియం తల్లి న్యాయం కోసం పోరాడుతుంది. ఏసీపీ సజ్జన్(సూరజ్ వెంజనమూడు) రంగంలో దిగుతాడు.ప్రత్యక్షసాక్షి చెప్పిన సాక్ష్యంతో నలుగురు నిందితులను పట్టుకుంటాడు. సొసైటీ నుండి నిందితులను చంపేయాలి అని డిమాండ్ వస్తుంది. పై నుంచి ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏసీపీ సజ్జన్ స్టేషన్ కు తరిలించే సమయంలో నిందితులను ఎన్ కౌంటర్ చేస్తాడు.
దీని మీద హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు పెడుతుంది. కేసులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఏసీపీ సజ్జన్ కి వ్యతిరేకంగా కేసు వాదిస్తాడు. నెక్స్ట్ ఏం అవుతుంది..? అరవిందన్ ఎవరు…? ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు..? సభా మరియం ఎందుకు చనిపోయారు..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…
టీ20 ప్రపంచకప్ 2026లోనే కాదు, అంతకు ముందు కూడా భారత జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయాల బాటలో నడిపిస్తూ…
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ను వివాహం చేసుకున్నాడు. శనివారం (ఫిబ్రవరి 21,…
టీ20 వరల్డ్ కప్ 2026లో చెత్త ప్రదర్శనపై టీమిండియా బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు స్సందించాడు. టోర్నీలో ఇప్పటి…