Mansoor Ali Khan : మన్సూర్ అలీ ఖాన్ పేరు నెట్టింట తెగ మారుమ్రోగగిపోతుంది.హీరోయిన్ త్రిష కృష్ణన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ఆపై అదంతా పెద్ద చర్చకు దారి తీయడం, సినీ రాజకీయ ప్రముఖులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం దాంతో మన్సూర్ క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే త్రిషకి మన్సూర్ సారీ చెప్పిన తర్వాత వివాదం సద్దుమణిగినట్టే అని అందరు భావించారు. కాని త్రిషకు సపోర్ట్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూలపై కేసును పెడతానంటూ కూడా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చిరంజీవి మీద రూ. 20 కోట్లు, త్రిష కుష్బూల మీద రూ. 10 కోట్ల చొప్పున దావా వేస్తున్నట్టుగా తాజాగా మన్సూర్ తెలిపాడు.
త్రిషకి సపోర్ట్ చేసిన చిరంజీవి మీద దారుణమైన కామెంట్లు చేశాడు మన్సూర్. నాది వక్ర బుద్ది అన్నాడు కదా.. పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవారికి సాయం చేయలేదు అని విమర్శించాడు. ఏడాదికి ఒకసారి ఓల్డ్ హీరోయిన్లతో మెగాస్టార్ చిరంజీవి పార్టీలు చేసుకుంటారని, వాళ్లతో వీళ్లతో పార్టీలు చేసుకునేందుకు ఆయనకు సమయం ఉంటుంది కానీ.. కానీ నాలాంటి వాళ్లకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అని అడిగే సమయం ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిష విషయంలో స్పందించే ముందు చిరంజీవి కనీసం తనకు ఫోన్ చేయాల్సిందని , ఏం జరిగింది, ఏంటి అని కూడా అడగకుండా ఇలా కామెంట్ చేయడం ఏం బాగోలేదు అంటూ నిప్పులు చెరిగారు.
చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నాకు తెలీదు.. ఆయన కూడా పార్టీ పెట్టాడు.. వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలీదు..ఆ డబ్బంతా వాళ్ల కోసమే వాడుకుంటున్నారు.. ప్రజల కష్టాలను తీర్చడం లేదు అని మన్సూర్ అన్నాడు. చిరంజీవి గారి మీద రూ. 20 కోట్లు, త్రిష, కుష్బూ గార్ల మీద పది కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసిన తాను ఆ డబ్బు వచ్చాక వాటితో పేదలకి సేవ చేస్తానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం మన్సూర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం(చెపాక్)లో విజిల్లపై నిషేధం అమలులోకి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లతో ఈ నిర్ణయం అమలవుతోంది.…
గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్తో కలిసి చేసిన ఓ సరదా…
ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్…
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…