Mansoor Ali Khan : మన్సూర్ అలీ ఖాన్ పేరు నెట్టింట తెగ మారుమ్రోగగిపోతుంది.హీరోయిన్ త్రిష కృష్ణన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ఆపై అదంతా పెద్ద చర్చకు దారి తీయడం, సినీ రాజకీయ ప్రముఖులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం దాంతో మన్సూర్ క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే త్రిషకి మన్సూర్ సారీ చెప్పిన తర్వాత వివాదం సద్దుమణిగినట్టే అని అందరు భావించారు. కాని త్రిషకు సపోర్ట్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూలపై కేసును పెడతానంటూ కూడా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చిరంజీవి మీద రూ. 20 కోట్లు, త్రిష కుష్బూల మీద రూ. 10 కోట్ల చొప్పున దావా వేస్తున్నట్టుగా తాజాగా మన్సూర్ తెలిపాడు.
త్రిషకి సపోర్ట్ చేసిన చిరంజీవి మీద దారుణమైన కామెంట్లు చేశాడు మన్సూర్. నాది వక్ర బుద్ది అన్నాడు కదా.. పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవారికి సాయం చేయలేదు అని విమర్శించాడు. ఏడాదికి ఒకసారి ఓల్డ్ హీరోయిన్లతో మెగాస్టార్ చిరంజీవి పార్టీలు చేసుకుంటారని, వాళ్లతో వీళ్లతో పార్టీలు చేసుకునేందుకు ఆయనకు సమయం ఉంటుంది కానీ.. కానీ నాలాంటి వాళ్లకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అని అడిగే సమయం ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిష విషయంలో స్పందించే ముందు చిరంజీవి కనీసం తనకు ఫోన్ చేయాల్సిందని , ఏం జరిగింది, ఏంటి అని కూడా అడగకుండా ఇలా కామెంట్ చేయడం ఏం బాగోలేదు అంటూ నిప్పులు చెరిగారు.
చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నాకు తెలీదు.. ఆయన కూడా పార్టీ పెట్టాడు.. వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలీదు..ఆ డబ్బంతా వాళ్ల కోసమే వాడుకుంటున్నారు.. ప్రజల కష్టాలను తీర్చడం లేదు అని మన్సూర్ అన్నాడు. చిరంజీవి గారి మీద రూ. 20 కోట్లు, త్రిష, కుష్బూ గార్ల మీద పది కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసిన తాను ఆ డబ్బు వచ్చాక వాటితో పేదలకి సేవ చేస్తానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం మన్సూర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…